సడలని సంకల్పం..అలుపెరగని పోరాటం
పోలీసుల ఆంక్షలు.. నిర్బంధాలను దాటుకుంటూ తమ నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జైలునుంచి త్వరగా విడుదల కావాలని ఆలయాలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలు
ఈనాడు-అమరావతి: పోలీసుల ఆంక్షలు.. నిర్బంధాలను దాటుకుంటూ తమ నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జైలునుంచి త్వరగా విడుదల కావాలని ఆలయాలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, అభిమానులు బాబుకు అండగా మేము అంటూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. వరుసగా పదకొండో రోజైన శనివారం కూడా దీక్షలు కొనసాగాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను ఎండగట్టి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని పార్టీ శ్రేణులు, అభిమానులు స్పష్టం చేశారు. తమ నేతను జైలుకు పంపితే నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని అడ్డుకున్న పోలీసులను తెదేపా కార్యకర్తలు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా వెరవకుండా నిరసన దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు.
తాడికొండ : పొన్నెకల్లులో కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ
తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో..
గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో బాబుకు తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలు జరిగాయి. తెదేపా నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తొమ్మిదో డివిజన్లోని ఓల్డ్క్లబ్ రోడ్డులో జరిగిన దీక్షల్లో గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్, మంగళగిరిలో వాణిజ్య, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొన్నూరులో ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో, తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో స్వరాజ్ థియేటర్ ప్రాంగణంలో తెదేపా నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో ఇన్ఛార్జి తెనాలి శ్రావణ్కుమార్, ప్రత్తిపాడులో ఇన్ఛార్జి రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
తాడికొండ శిబిరంలో తెనాలి శ్రావణ్కుమార్, నాయకులు
తాడికొండలో మరో చోట దీక్షా శిబిరం
తాడికొండ, న్యూస్టుడే: ‘శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మాపై దాడి చేశారు. ఎవరూ లేని సమయంలో ఏకంగా శిబిరాన్నే తొలగింపజేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తాం’ అని తెదేపా జిల్లా ఇన్ఛార్జి తెనాలి శ్రావణ్కుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి తాడికొండ అడ్డరోడ్డు సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి రిలే దీక్షలు చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు దాన్ని తొలగించారు. దీంతో శనివారం ఉదయం అడ్డరోడ్డు సెంటర్ పాత పెట్రోల్ బంక్ వద్ద నూతన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి తెదేపా నాయకులు నిరసనలు కొనసాగించారు. మండల, గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్ష నిర్వహించారు. మండలాధ్యక్షులు తలశిల ప్రసన్న కుమార్, ధనేకుల సుబ్బారావు, సీనియర్ నాయకులు కంచెర్ల శివరామయ్య, నూతలపాటి రామారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరులో రైతులు, తెదేపా నేతలు
నేర చరిత్ర ఉన్న వారు పాలకులైతే ఇలానే ఉంటుంది
మంగళగిరి, తాడేపల్లి: నేర చరిత్ర కలిగిన వారు పాలకులైతే అందరినీ అదే దృష్టితో చూస్తారనడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డే ఉదాహరణని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళగిరిలో తెదేపా నిర్వహిస్తున్న దీక్షలో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. శిబిరాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. బాబుతో మేను సైతం అంటూ సంఘీభావం ప్రకటించారు. నాయకులు భూలక్ష్మి, ఆశాబాల, శ్రీఅనిత, వైష్ణవి, మౌనిక, సుజాత, మహాలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి, కుసుమ, కృష్ణవందన, పద్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి శిబిరంలో దీక్షలో ఉన్నవారికి నిమ్మరసం ఇస్తున్న తెలుగు మహిళా పార్లమెంటు అధ్యక్షురాలు జయలక్ష్మి, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ రాజకుమారి
తెనాలి మండలం అంగలకుదురులో నిరాహార దీక్షలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు
మంగళగిరిలో నల్ల బెలూన్లతో తెలుగు మహిళల నిరసన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
[ 07-12-2023]
బాపట్ల జిల్లా (Bapatla district)లోని బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. -
పొలాలు ఏరులై.. కన్నీటి ధారలై..
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినప్పటికీ అది మిగిల్చిన నష్టం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీటి పాలయ్యాయి. -
లోకేశ్ చొరవతో పొలాల్లో నీరు బయటకు...
[ 07-12-2023]
రైతుల్ని ఆదుకుంటాం అని మాటలతో చెప్పి వదిలేయకుండా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదకొండూరులో లోకేశ్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కొత్త... -
మాట మార్చారు.. కౌలు మరిచారు..!
[ 07-12-2023]
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. నిబంధనల ప్రకారం ఏటా మే నెలలో చెల్లించాలి. ఈ ఏడాది డిసెంబర్ వచ్చినప్పటికీ తమకు సీఆర్డీఏ నుంచి కౌలు జమ కాలేదు. -
అంధకారంలో పల్లెలు.. అందని విద్యుత్తు వెలుగులు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
యువకులను కాపాడిన పోలీసులు
[ 07-12-2023]
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్క చేయకుండా కారులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అద్దంకి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన అద్దంకి నుంచి రేణంగివరం వెళ్లే దారిలో నల్లవాగు వద్ద మంగళవారం ఆర్ధరాత్రి దాటాక జరిగింది. -
వార్డు సచివాలయంపై వైకాపా జెండా!
[ 07-12-2023]
బాపట్ల 10వ వార్డు సచివాలయ భవనంపై వైకాపా జెండా ఏర్పాటు చేయడాన్ని తెదేపా బాపట్ల బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయంపై ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రంతో ఉన్న వైకాపా జెండాను ఏర్పాటు చేశారని,... -
జగనన్న కాలనీకి పడవలో వెళ్లాల్సిందేనా!
[ 07-12-2023]
జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారులు లబ్ధిదారుల వెంటపడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాలనీ జలమయమైంది. -
నిర్వహణ గాలికొదిలేసి.. నిలువునా ముంచేసి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతును తీవ్రంగా నష్టపరిచింది. అయితే ప్రకృతి వల్ల ఎదురైన విపత్తు కొంచెమైతే.. ప్రభుత్వ తప్పిదాలు, నిర్వాకం వల్ల అన్నదాతకు అపార నష్టం ఎదురైంది. జిల్లా పరిధిలో కాల్వలు, డ్రైనేజీలు వాగులు, వంకల నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది. -
అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రథమ స్థానం
[ 07-12-2023]
ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్పూరి చంద్రబాగ్ బీచ్లో ఈ నెల ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి... -
సీఆర్డీఏ నుంచి రాజధాని రైతులకు మళ్లీ నోటీసులు
[ 07-12-2023]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని, -
మిగ్జాం బీభత్సం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటిన తర్వాత బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బుధవారం ఉదయాన్నే అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మలను విద్యుత్తు స్తంభాలకు అడ్డం లేకుండా తొలగించారు. -
టిడ్కో గృహ సముదాయంలో కుంగిన నేల
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు రాజధాని గ్రామం పెనుమాక టిడ్కో గృహ సముదాయం నేల కుంగడంతో డ్రైనేజీ పైపులు విరిగిపోయాయి. దీంతో నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు సమన్వయంతో సాగాలి
[ 07-12-2023]
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చీఫ్ కమిషనర్ సంజయ్ పంథ్ సూచించారు. -
ఇదేనా ‘నాడు-నేడు’ నాణ్యత?
[ 07-12-2023]
రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో మార్పు తెచ్చాం...కార్పొరేటుకు దీటుగా ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాం...వేదికలపై ప్రభుత్వ పెద్దలు చెప్పే పదే పదే చెప్పే గొప్పలు ఇవి. -
రైతులకు పరిహారం చెల్లించాలి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. -
పంట నష్టం అంచనా వేస్తున్నాం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ పి.రంజిత్బాషా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలసి ఆయన పాల్గొన్నారు. -
బిక్కుబిక్కుమంటూ.. రాత్రంతా జాగరణ
[ 07-12-2023]
చుట్టూ నీళ్లు.. రాత్రంతా చీకటి.. దోమల బెడద.. దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కనీసం తాగేందుకు నీరు దొరక్క అల్లాడిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు. -
జగనన్నా.. కాలనీకి దారేదన్నా!
[ 07-12-2023]
-
నేర వార్తలు
[ 07-12-2023]
తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న బొప్పన కుసుమప్రియ(22) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి మహానాడుకు చెందిన కుసుమప్రియ విజయవాడలోని... -
తడిసిన ధాన్యాన్నీ కొనాల్సిందే: మాజీ మంత్రి
[ 07-12-2023]


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం