ఇంటింటికీ వెళ్దాం.. అరాచకంపై పోరాడదాం
‘అనేక కేసుల్లోని ముద్దాయి.. బెయిల్పై ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తన అవినీతి బురదను అందరిపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో అక్రమంగా అరెస్టు చేశారు.
మూడు జిల్లాల్లో 3 వేల మందిపై కేసులు
పోలీసు అధికారులపై న్యాయస్థానాల్లో దావాలు
తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల తీర్మానం
సమావేశంలో ఎమ్మెల్యేలు స్వామి, గొట్టిపాటి, ఏలూరి,మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల, ఉగ్ర నరసింహారెడ్డి,నాయకులు ఎరిక్షన్బాబు, కొండయ్య, నూకసాని
ఈనాడు, ఒంగోలు- ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ‘అనేక కేసుల్లోని ముద్దాయి.. బెయిల్పై ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తన అవినీతి బురదను అందరిపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో అక్రమంగా అరెస్టు చేశారు. చట్టసభలు, ప్రజాప్రతినిధులను కూడా హేళన చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నేతలు, కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ తర్వాత చేపట్టిన దీక్షల్లో భాగంగా పలుచోట్ల కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. సదరు పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. చంద్రబాబు జైలు నుంచి విడుదలై వచ్చేవరకు ప్రజాక్షేత్రంలో ఉందాం. అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేద్దాం. ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరిద్దాం. ప్రజా కంటక వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం’.. అని తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తీర్మానించారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చర్చించిన పలు అంశాలను కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అందరం ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ అరాచక విధానాలు, దుర్మార్గ వైఖరిని ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాలని కోరారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించేందుకు స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని.. పోలీసులు, మార్షల్స్ను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం కొందరు స్కిల్ స్కాం రూ.3 వేల కోట్లు అంటారు.. మరికొందరు రూ.370 కోట్లు అంటారని ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడతామని చెప్పారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబుపై తప్పుడు కేసుల పరంపర కొనసాగించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ప్రకాశం, బాపట్ల, నెల్లూరు ఎస్పీలు ఇప్పటివరకు 3 వేల మందికి పైగా తెదేపా శ్రేణులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు నిమిత్తం ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 25 వేల వరకు ఫారం-7 దరఖాస్తు చేశారని, ఈ విషయమై ఇప్పటికే సీఈవోను కలిసినట్లు తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ కింద రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల ద్వారా 2.30 లక్షల మందికి శిక్షణ ఇచ్చి అందులో 75 వేల మందికి ఉద్యోగాలిస్తే.. స్కాం అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నియోజకవర్గ బాధ్యులు గూడూరి ఎరిక్షన్బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎం.ఎం.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు బాధ్యులు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్రెడ్డి, బీఎన్.విజయ్కుమార్ ఫోన్లో తమ అభిప్రాయాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాలు ఏరులై.. కన్నీటి ధారలై..
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినప్పటికీ అది మిగిల్చిన నష్టం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీటి పాలయ్యాయి. -
లోకేశ్ చొరవతో పొలాల్లో నీరు బయటకు...
[ 07-12-2023]
రైతుల్ని ఆదుకుంటాం అని మాటలతో చెప్పి వదిలేయకుండా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదకొండూరులో లోకేశ్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కొత్త... -
మాట మార్చారు.. కౌలు మరిచారు..!
[ 07-12-2023]
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. నిబంధనల ప్రకారం ఏటా మే నెలలో చెల్లించాలి. ఈ ఏడాది డిసెంబర్ వచ్చినప్పటికీ తమకు సీఆర్డీఏ నుంచి కౌలు జమ కాలేదు. -
అంధకారంలో పల్లెలు.. అందని విద్యుత్తు వెలుగులు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
యువకులను కాపాడిన పోలీసులు
[ 07-12-2023]
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్క చేయకుండా కారులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అద్దంకి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన అద్దంకి నుంచి రేణంగివరం వెళ్లే దారిలో నల్లవాగు వద్ద మంగళవారం ఆర్ధరాత్రి దాటాక జరిగింది. -
వార్డు సచివాలయంపై వైకాపా జెండా!
[ 07-12-2023]
బాపట్ల 10వ వార్డు సచివాలయ భవనంపై వైకాపా జెండా ఏర్పాటు చేయడాన్ని తెదేపా బాపట్ల బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయంపై ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రంతో ఉన్న వైకాపా జెండాను ఏర్పాటు చేశారని,... -
జగనన్న కాలనీకి పడవలో వెళ్లాల్సిందేనా!
[ 07-12-2023]
జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారులు లబ్ధిదారుల వెంటపడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాలనీ జలమయమైంది. -
నిర్వహణ గాలికొదిలేసి.. నిలువునా ముంచేసి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతును తీవ్రంగా నష్టపరిచింది. అయితే ప్రకృతి వల్ల ఎదురైన విపత్తు కొంచెమైతే.. ప్రభుత్వ తప్పిదాలు, నిర్వాకం వల్ల అన్నదాతకు అపార నష్టం ఎదురైంది. జిల్లా పరిధిలో కాల్వలు, డ్రైనేజీలు వాగులు, వంకల నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది. -
అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రథమ స్థానం
[ 07-12-2023]
ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్పూరి చంద్రబాగ్ బీచ్లో ఈ నెల ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి... -
సీఆర్డీఏ నుంచి రాజధాని రైతులకు మళ్లీ నోటీసులు
[ 07-12-2023]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని, -
మిగ్జాం బీభత్సం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటిన తర్వాత బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బుధవారం ఉదయాన్నే అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మలను విద్యుత్తు స్తంభాలకు అడ్డం లేకుండా తొలగించారు. -
టిడ్కో గృహ సముదాయంలో కుంగిన నేల
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు రాజధాని గ్రామం పెనుమాక టిడ్కో గృహ సముదాయం నేల కుంగడంతో డ్రైనేజీ పైపులు విరిగిపోయాయి. దీంతో నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు సమన్వయంతో సాగాలి
[ 07-12-2023]
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చీఫ్ కమిషనర్ సంజయ్ పంథ్ సూచించారు. -
ఇదేనా ‘నాడు-నేడు’ నాణ్యత?
[ 07-12-2023]
రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో మార్పు తెచ్చాం...కార్పొరేటుకు దీటుగా ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాం...వేదికలపై ప్రభుత్వ పెద్దలు చెప్పే పదే పదే చెప్పే గొప్పలు ఇవి. -
రైతులకు పరిహారం చెల్లించాలి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. -
పంట నష్టం అంచనా వేస్తున్నాం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ పి.రంజిత్బాషా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలసి ఆయన పాల్గొన్నారు. -
బిక్కుబిక్కుమంటూ.. రాత్రంతా జాగరణ
[ 07-12-2023]
చుట్టూ నీళ్లు.. రాత్రంతా చీకటి.. దోమల బెడద.. దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కనీసం తాగేందుకు నీరు దొరక్క అల్లాడిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు. -
జగనన్నా.. కాలనీకి దారేదన్నా!
[ 07-12-2023]
-
నేర వార్తలు
[ 07-12-2023]
తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న బొప్పన కుసుమప్రియ(22) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి మహానాడుకు చెందిన కుసుమప్రియ విజయవాడలోని... -
తడిసిన ధాన్యాన్నీ కొనాల్సిందే: మాజీ మంత్రి
[ 07-12-2023]


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు