నిర్వహణ లేదు... నీరు పారదు..
గుంటూరు జిల్లాలో కొండవీటివాగు, కొటేళ్లవాగు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరివాహక ప్రాంతంలోని రైతులకు శాపంగా మారింది. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిపై కక్ష కట్టి అభివృద్ధి ఆపేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
పొలాలను ముంచెత్తిన నీరు
కొండవీటివాగు పరిధిలో ఇదీ పరిస్థితి
పెదపరిమి వద్ద కొండవీటి వాగు, కొటేళ్ల వాగు ఉద్ధృతితో నీట మునిగిన పొలాలు
ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లాలో కొండవీటివాగు, కొటేళ్లవాగు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరివాహక ప్రాంతంలోని రైతులకు శాపంగా మారింది. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిపై కక్ష కట్టి అభివృద్ధి ఆపేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సీఆర్డీఏ చేపట్టిన వివిధ రోడ్ల పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాగుల నీరు ముందుకు వెళ్లే మార్గం లేక వెనక్కి వచ్చి పొలాలు నీట మునుగుతున్నాయి. కొండవీటివాగు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయడానికి రూ.30లక్షల నిధులు ఇవ్వాలని జలవనరులశాఖ గతేడాది సీఆర్డీఏకి లేఖ రాసినా స్పందన లేదు. నాలుగేళ్లుగా కొండవీటివాగు నిర్వహణకు రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడంతో పెదపరిమి, నీరుకొండ, తాడికొండ గ్రామాలకు చెందిన పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
అడ్డంకులు తొలగించనందునే...
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని కొండల్లో ప్రారంభమయ్యే కొండవీటివాగు తాడేపల్లి మండలంలోని ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. లాం గ్రామం నుంచి వాగు ఉద్ధృతి మొదలై పెదపరిమి దాటిన తర్వాత కొటేళ్లవాగు, కృష్ణాయపాలెం వద్ద పాలవాగు కలయికతో మరింత ఉద్ధృతితో ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మించిన గత ప్రభుత్వం తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో పొలాలు నీటమునగకుండా నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసింది. ఈ ప్రాంతంలోనే రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడంతో కొండవీటివాగు అభివృద్ధి పనులు ప్రారంభించింది. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా రాజధానికి ఇబ్బంది లేకుండా వాగును విస్తరించడంతో పాటు ప్రవాహం సజావుగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. అవసరమైనచోట వంతెనల నిర్మాణం ప్రారంభించారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. కనీసం వాగులో పిచ్చిమొక్కలు, తూటుకాడ కూడా తొలగించడం లేదు. పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వరద వచ్చినప్పుడు ప్రవాహాన్ని సజావుగా పంపే ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వాగు నీరు వెనక్కి వచ్చి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలను ముంచెత్తుతోంది. వేల ఎకరాల్లో రెండు వారాలుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పంటలు వేసుకోలేని పరిస్థితి. పెదపరిమి, తాడికొండ పొలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు పంటలు సాగు చేయలేని దుస్థితి.
ఎత్తిపోతల పథకం వద్దకు చేరని నీరు...
కొండవీటివాగులో గరిష్ఠంగా 10వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుంది. పొలాలు ముంచెత్తకుండా సజావుగా తరలించడానికి రూ.237కోట్లతో 2018లో గత ప్రభుత్వం కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 5వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసే సౌకర్యం ఉంది. వాగు నీరు అక్కడికి వెళ్లడానికి దారిలో అనేక అడ్డంకులు ఉండడంతో ఎక్కడికక్కడ ఆగిపోతోంది. దీంతో పథకం నిర్మించినా నిరుపయోగంగా మారింది. పథకం వద్దకు వరద నీరు వస్తే ఎత్తిపోయడానికి తాము సిద్ధంగా ఉన్నామని జలవనరుల శాఖ చెబుతోంది. ఇటీవల కొంత వరద నీరు వస్తే వెంటనే ఎత్తిపోశామని గుర్తు చేస్తున్నారు.
ఎవరికివారే యమునాతీరే...
కొండవీటివాగు వరద సమస్య గతంలో కూడా ఉండేది. అయితే వాగుల నిర్వహణ గతంలో జలవనరులశాఖ అధికారులు చూసుకునేవారు. వరద ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టేవారు. కొన్ని పనులు రైతులు చేసుకుని సహకరించేవారు. రాజధాని ఏర్పడ్డాక కొండవీటివాగులో ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో తమ పరిధిలో లేదని జలవనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులతో పాటు వాగు నిర్వహణ, వరదనీటి తరలింపును సీఆర్డీఏ సైతం విస్మరించింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు గతేడాది రూ.30లక్షలతో సీఆర్డీఏకి ప్రతిపాదనలు పంపారు. నిధులు విడుదల చేస్తే జలవనరుల శాఖ తరఫున వాగులో పనులు చేస్తామని, లేదా సీఆర్డీఏ అయినా పనులు చేసి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సీఆర్డీఏ నుంచి స్పందన శూన్యం.
ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే...
కొండవీటివాగు ప్రాంతంలో ఎంత వరద వస్తుందో లెక్కించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గాలికొదిలేసింది. రాజధాని గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే కొండవీటివాగు నిర్వహణ పట్టించుకోవడం లేదని నీరుకొండకు చెందిన గోవర్ధన్రావు నిలదీశారు. తూటుకాడ, గుర్రపుడెక్కతో నిండిపోయి వాగు ఆనవాళ్లు కనిపించకపోయినా పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు. కొత్తవి ఎలాగూ నిర్మించరు. కనీసం ఉన్నవాటినైనా సక్రమంగా నిర్వహించడం, మరమ్మతులు చేయకపోతే ఎలా అని తాడికొండకు చెందిన ధనేకుల హరిబాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
[ 05-12-2023]
వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
తీరంలో.. భయం.. భయం
[ 05-12-2023]
మిగ్జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠ!
[ 05-12-2023]
తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. -
ఆ రెండు గ్రామాలకు పెనుముప్పు!
[ 05-12-2023]
మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. -
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. -
పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?
[ 05-12-2023]
చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. -
రైతుల అవసరాలు తీర్చడానికే ఆర్బీకేలు
[ 05-12-2023]
విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. -
ప్రజావ్యతిరేక పాలనతో పతనం తప్పదు
[ 05-12-2023]
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. -
జగన్ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు
[ 05-12-2023]
జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆన్లైన్ లావాదేవీలతో అవస్థలు
[ 05-12-2023]
పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. -
తప్పుల తడకగా ముసాయిదా జాబితా
[ 05-12-2023]
సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
వసతి గృహాల్లో హెచ్డబ్ల్యూవోల బసకు ఆదేశం
[ 05-12-2023]
జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. -
నిరుడు మాండౌస్.. నేడు మిగ్జాం
[ 05-12-2023]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు.. -
ఓటర్ల జాబితా ప£రిశీలకుడి రాక వాయిదా
[ 05-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. -
చెరువు మట్టి దోపిడీ.. వైకాపా నేతల్లో విభేదాలు
[ 05-12-2023]
మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.