బడిఈడు పిల్లలెక్కడ?
బడి-ఈడు విద్యార్థులందరినీ బడిలో ఉండేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ వెనుకబడింది. పల్నాడు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే గుంటూరులోనే చాలా మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సర్వేలో వెల్లడైంది.
7561 మందిని గుర్తించడంలో విద్యా శాఖ వైఫల్యం
గుంటూరు మండల విద్యా శాఖ కార్యాలయం
ఈనాడు, అమరావతి: బడి-ఈడు విద్యార్థులందరినీ బడిలో ఉండేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ వెనుకబడింది. పల్నాడు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే గుంటూరులోనే చాలా మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సర్వేలో వెల్లడైంది. ఆయా పాఠశాలల్లో పేరు నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ తిరిగి బడికి వెళ్లేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ చతికిలబడింది.
జిల్లాలో 5-18 ఏళ్లలోపు వయస్సు పిల్లలు 2,56,544 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, మదర్సా పాఠశాలల్లో నమోదయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ నెల 25కు 2,48,983 మంది విద్యార్థులే ఉన్నారు. మిగిలిన 7561 మంది విద్యార్థులు ఎక్కడ ఉన్నారో అధికారులకే తెలియాలి. వారు బడి బయట ఉంటే ఏదైనా పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారా అనేది కూడా యంత్రాంగం తేల్చలేకపోయింది.
నిర్దేశిత బడి-ఈడు పిల్లలు పాఠశాలల్లో తప్ప మరెక్కడా ఉండరాదని, బయట ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఆ మధ్య పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు బీరాలు పలికారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటికీ 7561 మంది విద్యార్థులు స్కూళ్లల్లో కనిపించడం లేదు. దీనికి విద్యాశాఖ ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి! జీఈఆర్ సర్వే పేరుతో గత కొద్ది రోజులుగా విద్యాశాఖ యంత్రాంగం బడి ఈడు పిల్లల్ని గుర్తించి వారు బడికి వెళ్లేలా చేయాలని కార్యాచరణ తీసుకుంది. సాక్షాత్తు ఆ సర్వేలోనే బడిబయట 7500 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడైంది. ప్రతి హెచ్ఎం, ఎంఈఓ జీఈఆర్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా కొందరు ఎంఈఓలు దీన్ని తేలిగ్గా తీసుకోవడంతో పిల్లలు ఏ ఒక్క చోట కూడా నూరు శాతం బడిలో లేరు.
గుంటూరులోనే అధికంగా...
గుంటూరు నగరంలోనే జీఈఆర్ సర్వే ప్రకారం బడి-ఈడు పిల్లలు అందరినీ బడికి పంపడంలో మండల విద్యాశాఖ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఏకంగా నలుగురు ఎంఈఓలు ఉన్నా గుంటూరు మండలంలో పిల్లల్ని బడికి పంపేలా చేయడంలో విఫలమయ్యారు. పొన్నూరు, ప్రత్తిపాడు, ఫిరంగిపురం, కాకుమాను మండలాల్లో ఎక్కడ చూసినా బడి బయట ఉన్న పిల్లలు 10 మంది లోపు ఉన్నారు. జిల్లా మొత్తంగా బడి బయట
ఉన్న పిల్లల సంఖ్య 7561 కాగా అందులో ఒక్క గుంటూరు మండలంలోనే అత్యధికంగా 4370 మంది ఉన్నారు. వీరిని సచివాలయాల వారీగా ఉండే వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీల సహాయంతో గుర్తించి బడికి పంపాల్సి ఉంది. నగరంలో 207 సచివాలయాలు ఉంటే వాటిల్లో 45 సచివాలయాల పరిధిలో ఇప్పటికీ పిల్లల గుర్తింపు ప్రక్రియ నూరు శాతం చేపట్టలేదు. ఆర్జేడీ, డీఈఓ తదితర ఉన్నతాధికారులు అందరూ ఉండే గుంటూరులో జీఈఆర్ సర్వేలో వెనకబడడం గమనార్హం. గతంలో గుంటూరు మండలం మొత్తానికి కలిపి ఒకే ఒక్క ఎంఈఓ ఉండేవారు. అప్పట్లోనే మండలంలో విద్యాశాఖ కార్యకలాపాలు బాగా జరిగేవని, ప్రస్తుతం నలుగురు ఎంఈఓలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఉపాధ్యాయవర్గం అంటోంది.
- ఇంకా ఆగస్టు నెలకు సంబంధించి 40 మంది ఉపాధ్యాయులకు మండలంలో జీతాలు జమ కాలేదు. సెప్టెంబరు జీతాల బిల్లుల్ని ఇప్పటి వరకు వెస్ట్ మండల పరిధిలో ఇంకా తయారు చేసి పంపలేదు. మండలంలో పనిచేసే ఉపాధ్యాయులకు సకాలంలో జీతాల బిల్లులు చేయడానికి వీలుగా ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జీతాల బిల్లుల నుంచి నాడు-నేడు పనుల దాకా ప్రతిదీ మండలంలో సమస్యగానే ఉంది. చాలా స్కూళ్లకు రివాల్వింగ్ ఫండ్ రాక పనులు జాప్యమవుతున్నాయి. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద సామగ్రి రప్పించుకోవడానికి ఇన్వాయిస్లు జనరేట్ చేయలేదు. ఇలా మండలంలో విద్యాశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. నలుగురిని సమన్వయపరిచి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీరంలో.. భయం.. భయం
[ 05-12-2023]
మిగ్జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠ!
[ 05-12-2023]
తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. -
ఆ రెండు గ్రామాలకు పెనుముప్పు!
[ 05-12-2023]
మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. -
దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
[ 05-12-2023]
వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. -
పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?
[ 05-12-2023]
చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. -
రైతుల అవసరాలు తీర్చడానికే ఆర్బీకేలు
[ 05-12-2023]
విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. -
ప్రజావ్యతిరేక పాలనతో పతనం తప్పదు
[ 05-12-2023]
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. -
జగన్ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు
[ 05-12-2023]
జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆన్లైన్ లావాదేవీలతో అవస్థలు
[ 05-12-2023]
పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. -
తప్పుల తడకగా ముసాయిదా జాబితా
[ 05-12-2023]
సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
వసతి గృహాల్లో హెచ్డబ్ల్యూవోల బసకు ఆదేశం
[ 05-12-2023]
జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. -
నిరుడు మాండౌస్.. నేడు మిగ్జాం
[ 05-12-2023]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు.. -
ఓటర్ల జాబితా ప£రిశీలకుడి రాక వాయిదా
[ 05-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. -
చెరువు మట్టి దోపిడీ.. వైకాపా నేతల్లో విభేదాలు
[ 05-12-2023]
మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.