జగన్ మామయ్యా.. దాహమేస్తుందయ్యా!
‘నాడు-నేడు’ ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
విద్యార్థులకు తప్పని పాట్లు
మాచవరంలో వినియోగంలోకి రాని ప్లాంటు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల గ్రామీణ: ‘నాడు-నేడు’ ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రూ.లక్షలు పెట్టి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా జిల్లాలో 80శాతం బడుల్లో మూలనపడ్డాయి. కొన్ని నెలలకే మరమ్మతులకు గురవడం, సరైన నిర్వహణ కొరవడడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు దూరమైంది. దీంతో చేతిపంపు నీరే దిక్కవుతోంది. కొంతమంది ఇళ్లనుంచే నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు. కొన్నిరోజులకే మరమ్మతులు జిల్లాలో కొన్నిచోట్ల దాతలు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయగా, మరికొన్ని బడుల్లో ప్రభుత్వమే రూ.లక్షలు పెట్టి ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కొన్ని నెలలకే అవి మరమ్మతులకు గురయ్యాయి. ఫిల్టర్ క్యాండిల్స్ అరిగిపోయాయి. వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్యాండిల్స్ మార్చాల్సి ఉందని యాప్లో అధికారుల దృష్టికి ఆయా ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్తున్నా స్పందన ఉండడం లేదు. ప్లాంటు మరమ్మతుకు గురైతే నిర్వహణ ఖర్చులు భరించడం ఉపాధ్యాయులకు భారమవుతోంది. జీతాలే సరిగా రాకపోవడం, సొంత నిధులు చెల్లిస్తే బిల్లులు వస్తాయో రావోనన్న భయంతో వాటిని అలానే వదిలేస్తున్నారు.
జిల్లా మొత్తం అదే తీరు:
- నరసరావుపేటలో మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో రెండేళ్లుగా ఆర్వోప్లాంటు పనిచేయడం లేదు. 900 మంది విద్యార్థినులకు మునిసిపల్ కుళాయి నీరే దిక్కు.
- వినుకొండలో గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద ప్లాంటు నెలకోసారి మరమ్మతులకు గురవుతోంది. ఇక్కడ 250 మంది విద్యార్థినులున్నారు. హనుమాన్నగర్లో యూపీ స్కూల్లో ప్లాంటులో ఫిల్టర్ కావడం లేదు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యుత్తు కనెక్షన్ సమస్య ఉంది. నడిగడ్డ జడ్పీ పాఠశాలలో ప్లాంట్ మరమ్మతులకు గురైంది. 304 మందికి తాగునీరు లేదు.
- పెదకూరపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల దాతల సహకారంతో రూ.2లక్షలతో ప్లాంటు ఏర్పాటు చేశారు. పదిరోజుల క్రితం మరమ్మతులకు గురైంది. ఫిల్టర్కాకుండా తాగునీరు వస్తోంది. గ్రాంటు లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ 430 మంది విద్యార్థులు చదువుతున్నారు.
- యడ్లపాడు మండలం వంకాయలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ తొలివిడతలో ఆర్వో మంజూరైంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పనిచేయడం లేదు. మొత్తం 380 మంది విద్యార్థులు చదువుతున్నారు.
- అమరావతి మండలం దిడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడు నెలలుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. నీటి ప్లాంటు పనిచేయడం లేదని హెచ్ఎం యాప్లో నమోదు చేసినా స్పందన లేదు. ఇక్కడ 140 మంది చదువుతున్నారు.
- * ఈపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఇనుమెళ్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది నెలల క్రితం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లకు విద్యుత్తు కనెక్షన్ ఇంతవరకూ ఇవ్వలేదు. కొండ్రముట్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కొచ్చర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో ప్లాంట్లు నిర్వహణ లేక మూలనపడ్డాయి.
- బెల్లంకొండ మండలంలో మొత్తం 16 ఆర్వో ప్లాంట్లు ఉండగా, అందులో 10 ప్లాంట్లు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. యాప్లో అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని హెచ్ఎంలు చెబుతున్నారు.
- మాచర్లలో క్లాక్టవర్ పాఠశాలలో ఆరు నెలలుగా ప్లాంటు పనిచేయడం లేదు. 250 మంది విద్యార్థులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఆర్వోప్లాంట్లు పనిచేయకపోవడం, విద్యార్థుల తాగునీటి సమస్యను జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ దృష్టికి తీసుకెళ్లగా అది తమ పరిధిలో లేదని, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ వాళ్లు చూస్తున్నారని చెప్పారు.
- గురజాల మండలం మాడుగుల గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. 406 మంది తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెగుంత ఆదర్శ పాఠశాలలో నిర్వహణ లేక ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. 650 మంది విద్యార్థులకు తాగునీరు లేకుండా పోయింది.
- మాచవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఆర్వో ప్లాంటు మంజూరై సంవత్సరం అవుతోంది. ఇంతవరకూ పరదా తీయలేదు. వృథానీరు పోవడానికి పైపులు రావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 650 మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదు. ప్రాథమిక పాఠశాలలో 137 మంది బోరు నీరు తాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీరంలో.. భయం.. భయం
[ 05-12-2023]
మిగ్జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠ!
[ 05-12-2023]
తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. -
ఆ రెండు గ్రామాలకు పెనుముప్పు!
[ 05-12-2023]
మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. -
దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
[ 05-12-2023]
వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. -
పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?
[ 05-12-2023]
చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. -
రైతుల అవసరాలు తీర్చడానికే ఆర్బీకేలు
[ 05-12-2023]
విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. -
ప్రజావ్యతిరేక పాలనతో పతనం తప్పదు
[ 05-12-2023]
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. -
జగన్ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు
[ 05-12-2023]
జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆన్లైన్ లావాదేవీలతో అవస్థలు
[ 05-12-2023]
పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. -
తప్పుల తడకగా ముసాయిదా జాబితా
[ 05-12-2023]
సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
వసతి గృహాల్లో హెచ్డబ్ల్యూవోల బసకు ఆదేశం
[ 05-12-2023]
జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. -
నిరుడు మాండౌస్.. నేడు మిగ్జాం
[ 05-12-2023]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు.. -
ఓటర్ల జాబితా ప£రిశీలకుడి రాక వాయిదా
[ 05-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. -
చెరువు మట్టి దోపిడీ.. వైకాపా నేతల్లో విభేదాలు
[ 05-12-2023]
మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!