జలదిగ్బంధంలో విఠలేశ్వర నగర్
వర్షం కురిస్తే రహదారులు జలమయం. భారీవర్షమైతే గృహాలను నీరు చుట్టుముడుతుంది. ఇది స్థానిక విఠలేశ్వరనగô్ పరిస్థితి. రెండుమూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం జలదిగ్బంధంలో ఉంటోంది.
గృహాలను చుట్టుముట్టిన వర్షపునీరు
భట్టిప్రోలు, న్యూస్టుడే : వర్షం కురిస్తే రహదారులు జలమయం. భారీవర్షమైతే గృహాలను నీరు చుట్టుముడుతుంది. ఇది స్థానిక విఠలేశ్వరనగర్ పరిస్థితి. రెండుమూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం జలదిగ్బంధంలో ఉంటోంది. పది రోజుల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి డాక్టరు మేరుగ నాగార్జున పర్యటించే ముందు అధికారులు వర్షం నీరు నిల్వ లేకుండా బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కాలనీని సందర్శించారు. కానీ ఫలితం ఏమీ లేదని గ్రామస్థులు వాపోయారు. మంత్రి నాగార్జున తిరుగుతారని ఆ రోజు మాత్రం లారీ డస్టును వేసి గుంతలను పూడ్చారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చి కాలనీవాసులకు వాగ్దానం చేశారు. కానీ నేటికి పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు అడుగుల లోతులో నీరు ఉండటంతో కాలనీవాసులు బయటకు రాలేకపోతున్నమని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం హాయాంలో రహదారి పనులు ప్రారంభించారు. ఎన్నికల సమయం రావడంతో పనులు నిలిచాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఆ నీటిలో నడిచి వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు. కాలనీ పక్కనే చెరువు ఉండటంతో చెరువు పొంగి మరింత నీరు ఎక్కువతోంది. దోమలు మోతకి అల్లాడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాలు ప్రబలుతాయేమోనని భయపడుతున్నారు. నీరు నిల్వతో డెంగీ దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాలనీవాసులు అనారోగ్యానికి గురికాకముందే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈవిషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు మాట్లాడుతూ కాలనీని పరిశీలించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీరంలో.. భయం.. భయం
[ 05-12-2023]
మిగ్జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠ!
[ 05-12-2023]
తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. -
ఆ రెండు గ్రామాలకు పెనుముప్పు!
[ 05-12-2023]
మండల పరిధిలోని దానవాయిపేట, సూర్యలంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. సముద్రం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే రెండు గ్రామాలు ఉండటంతో స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. -
దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
[ 05-12-2023]
వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. -
పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?
[ 05-12-2023]
చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. -
రైతుల అవసరాలు తీర్చడానికే ఆర్బీకేలు
[ 05-12-2023]
విత్తడానికి ముందు నుంచి.. పంట ఉత్పత్తులు వచ్చిన తర్వాత వాటిని విక్రయించుకునే వరకు రైతులకు సహాయం చేసి వారి అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. -
ప్రజావ్యతిరేక పాలనతో పతనం తప్పదు
[ 05-12-2023]
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించిన ఏ పార్టీకైనా పతనం తప్పదని రాజధాని రైతులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే దానికి నిదర్శనమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. -
జగన్ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు
[ 05-12-2023]
జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆన్లైన్ లావాదేవీలతో అవస్థలు
[ 05-12-2023]
పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. -
తప్పుల తడకగా ముసాయిదా జాబితా
[ 05-12-2023]
సరైన వివరాలు లేని ఓటర్ల జాబితాలతో ప్రజాస్వామ్యం మనుగడ, ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
వసతి గృహాల్లో హెచ్డబ్ల్యూవోల బసకు ఆదేశం
[ 05-12-2023]
జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. -
నిరుడు మాండౌస్.. నేడు మిగ్జాం
[ 05-12-2023]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు.. -
ఓటర్ల జాబితా ప£రిశీలకుడి రాక వాయిదా
[ 05-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. -
చెరువు మట్టి దోపిడీ.. వైకాపా నేతల్లో విభేదాలు
[ 05-12-2023]
మండలంలోని ములకలూరు సాగునీటి చెరువులో మట్టి దోపిడీ వ్యవహారం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలకు దారి తీసింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్న చెరువులో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!