logo

TS News: నా చావుకు వారే కారణం

‘నన్ను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. నేను తప్పులు చేయకున్నా చేసినట్లుగా పని గట్టుకుని వేధిస్తున్నా సూపర్‌వైజర్లు రాజేశ్‌, సంపత్‌, కొండల్‌రెడ్డి నా చావుకు కారణం’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు

Published : 20 Jul 2021 08:15 IST

● సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

● మృతుడు తొషీబా కంపెనీ కార్మికుడు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ‘నన్ను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. నేను తప్పులు చేయకున్నా చేసినట్లుగా పని గట్టుకుని వేధిస్తున్నా సూపర్‌వైజర్లు రాజేశ్‌, సంపత్‌, కొండల్‌రెడ్డి నా చావుకు కారణం’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి గ్రామీణ స్టేషన్‌ పరిధిలో కుల్పగూర్‌ శివారులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌ కాలనీకి చెందిన గౌండ్ల ప్రసాద్‌ గౌడ్‌ (31) పటాన్‌చెరు మండలం రుద్రారంలోని తొషీబా పరిశ్రమలో పని చేస్తున్నారు. మరో వ్యక్తి తప్పు చేస్తే శనివారం తనను నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబీకులు పట్టణ ఠాణాను ఆశ్రయించారు. అక్కడి పోలీసులు తమ పరిధి కాదని, గ్రామీణ ఠాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. ప్రసాద్‌ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని సంగారెడ్డి గ్రామీణ ఎస్‌ఐ కె.సుభాష్‌‘ న్యూస్‌టుడే’ చెప్పారు. సదరు పరిశ్రమ నిర్వాహకుల వద్దకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వెళ్లి చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని