Jamtara Gang: సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు తెలియని విషయాలూ వీరికి తెలుసు
చేతిలో స్మార్ట్ఫోన్.. హైస్కూల్ దాటని చదువు... నలుగురైదుగురు కలిసి చాయ్ దుకాణం.. చెట్ల కింద ముచ్చట్లు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా తాలూకా
బాధితుల సొమ్ముతో విందులు.. వినోదాలు
జాంతారా నేరస్థుల జీవనశైలి..
ఈనాడు, హైదరాబాద్: చేతిలో స్మార్ట్ఫోన్.. హైస్కూల్ దాటని చదువు... నలుగురైదుగురు కలిసి చాయ్ దుకాణం.. చెట్ల కింద ముచ్చట్లు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా తాలూకా తారట్, ధన్బాద్, దేవ్గడ్ గ్రామాల్లో కనిపించే దృశ్యాలివి.. చూడగానే అమాయకుల్లా కనిపించే వీరు 14 రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఝార్ఖండ్, పశ్చిమబంగా రాష్ట్రాల్లోని హిందీ యాసతో మాట్లాడుతున్న వీరు నిజానికి అసాధ్యులు... సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు తెలియని విషయాలూ వీరికి తెలుసు.. నిమిషాల వ్యవధిలో ఈ-వ్యాలెట్ల ద్వారా నగదు బదిలీ చేయడం మంచినీళ్లు తాగినంత సులువు.. జాంతారా తాలూకాల్లోని ఐదు గ్రామాల్లో నివసిస్తున్న యువకులంతా కలిసి 200 నుంచి 250 ముఠాలుగా ఏర్పడ్డారు. ఆరేడు ఏళ్ల నుంచి డెబిట్కార్టు, క్రెడిట్కార్టుల మోసాలతో నేరాల బాట పట్టారు.. కొద్దిరోజుల క్రితం అక్కడికి వెళ్లిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ బృందం వారిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఇక్కడి తీసుకువచ్చింది.
పొరుగు రాష్ట్రం నుంచి సిమ్కార్టులు...
పోలీసులు సిమ్కార్డుల ద్వారా తమను గుర్తిస్తున్నారని తెలుసుకున్న జాంతారా సైబర్ నేరస్థులు పంథా మార్చేశారు. సిమ్కార్డులు కొనేందుకు కోల్కతాకు వెళ్తున్నారు. లల్లా, కసాబా, ప్రాంతాలకు వెళ్లి వందల సంఖ్యలో సిమ్కార్డులు తీసుకువస్తున్నారు. తప్పుడు పేర్లతో నకిలీ ఆధార్కార్డులు సృష్టించడం, ఫొటోలు అప్పటికప్పుడు లేవంటూ చెప్పడంతో సిమ్కార్డులు అమ్ముతున్న వారు వీరికి అడిగినన్ని సిమ్లను ఇచ్చేస్తున్నారు. వాటితో బ్యాంక్ అధికారులు, పేటీఎం, ఫోన్పే ప్రతినిధులమంటూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల నుంచి నగదు బదిలీ చేసుకోగానే ఆ సిమ్కార్డులను పంటకాల్వలు, మురుగు కాల్వల్లో పారేస్తున్నారు.
నిరుపేదలమంటూ నమ్మబలుకుతూ..
ఈ-వ్యాలెట్ల ద్వారా దోచుకున్న నగదుతో జాంతారా సైబర్ నేరస్థులు విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బులు స్వాధీనం చేసుకోని విధంగా జాగ్రత్త పడుతున్నారు. తాము నిరుపేదలమని, అప్పు తీసుకున్నామంటూ పత్రాలు చూపిస్తున్నారు. వారు దొంగలు కాదు.. నిజంగా కష్టపడేవారేనంటూ స్థానికులు సైతం పోలీసులకు సాక్ష్యం చెబుతున్నారు. దీంతో వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇటీవలే ఆ రాష్ట్రపోలీస్ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు దర్యాప్తులో సహకరించాలంటూ జాంతారా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్