దామోదరం సంజీవయ్య కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి: వీహెచ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య

Updated : 18 Oct 2021 17:22 IST


హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయలు తప్పకుండా పాల్గొనాలని సూచించారు. దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయతీపరుడని.. ఆయన్ను గౌరవించుకోవాలని తెలిపారు. కర్నూల్‌లో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముందుకు రావడంపై వీహెచ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని