logo

Couple: భార్యాభర్తలు గొడవపడి.. పోలీసుల్ని పరిగెత్తించి..

భార్యాభర్తలు గొడవ పడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించుకున్నారు. బయటకు వెళ్లిన భర్త రామకృష్ణ ఓచోట పురుగు మందు తాగి పడిపోయాడు. పోలీసులు అతడిని

Updated : 24 Nov 2022 14:50 IST

పురుగు మందు తాగిన రామకృష్ణ

ఆమనగల్లు (కడ్తాల్‌), న్యూస్‌టుడే:  భార్యాభర్తలు గొడవ పడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించుకున్నారు. బయటకు వెళ్లిన భర్త రామకృష్ణ ఓచోట పురుగు మందు తాగి పడిపోయాడు. పోలీసులు అతడిని వాట్సాప్‌ లొకేషన్‌ ద్వారా గుర్తించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలోని టాక్‌రాజ్‌గూడ గ్రామం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. కడ్తాల్‌ ఎస్సై హరిశంకర్‌గౌడ్‌, వెల్దండ ఎస్సై నర్సింహులు వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన రేవల్లి రామకృష్ణ, మానసలకు ఏడాది కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో గురువారం మధ్యాహ్నం గొడవపడ్డారు.

ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రామకృష్ణ వెల్దండ ఎస్సై నర్సింహులుకు ఫోన్‌ చేసి తన భార్య మానస పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటోందని తెలుపుతూ ఆమె ఫోన్‌ నంబరు ఇచ్చాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఫోన్‌ నంబరు ఆధారంగా లొకేషన్‌ను గుర్తించి మానసను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పురుగు మందు తాగలేదని గుర్తించిన పోలీసులు వెంటనే భర్త రామకృష్ణకు ఫోన్‌చేసి మీ భార్య క్షేమంగానే ఉందని తెలిపారు. అయితే రామకృష్ణ తాను పురుగు మందు తాగానని, కడ్తాల్‌ సమీపంలో ఉన్నానని తన భార్య మానసకు లొకేషన్‌ పెట్టాడు. మానస వెంటనే వెల్దండ పోలీసులకు దాన్ని షేర్‌ చేసింది. వెల్దండ ఎస్సై నర్సింహులు వెంటనే కడ్తాల్‌ ఎస్సై హరిశంకర్‌గౌడ్‌కు విషయం చెప్పగానే ఆయన వెళ్లి రామకృష్ణను గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు