Crime News: వ్యాపారవేత్త శిల్ప అరెస్టు.. పార్టీలిచ్చి ప్రముఖులకు రూ.కోట్లలో కుచ్చుటోపీ!

అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి ప్రముఖుల నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 Nov 2021 05:34 IST

హైదరాబాద్‌: వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానంటూ మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి అనే మహిళ ఆమె భర్త శ్రీనివాస్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రూ.కోటి 5లక్షల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు.

దివ్య నుంచి రూ.కోటిగా పైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన శిల్పా చౌదరి తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకొని పలువురిని రూ. కోట్లలో మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను శిల్ప ఆకర్షించినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని