విధులు మరిచి.. వసూళ్లకు మరిగి!
బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి.. ఓ కేసు నుంచి నిందితుణ్ని తప్పించి డబ్బు వసూలు చేసిన హోంగార్డు, మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజిగిరి
కేసు కాకుండా నిందితుణ్ని తప్పించి డబ్బు
తీసుకున్న హోంగార్డు బృందం రిమాండ్
శివ శ్రీను బాలరాజు
ఘట్కేసర్, న్యూస్టుడే: బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి.. ఓ కేసు నుంచి నిందితుణ్ని తప్పించి డబ్బు వసూలు చేసిన హోంగార్డు, మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, ఘట్కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ పురపాలిక పరిధిలోని ద్వారకానగర్లో ఉంటున్న బండారపు శివ(44) ఘట్కేసర్ ఠాణాలో హోంగార్డు. పోలీసు పెట్రోల్ వాహనం డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఘట్కేసర్ బాలాజీనగర్కు చెందిన మాజీ హోంగార్డు ఎల్లిజర్ల బాలరాజు(35), అంబేడ్కర్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ డి.శ్రీను(36).. శివ స్నేహితులు. ఈనెల 25న రాత్రి వరంగల్ జాతీయ రహదారి ఎన్ఎఫ్సీనగర్ వంతెన వద్ద ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ మృతి చెందాడు. హోంగార్డు శివ ఘటనా స్థలికి చేరుకుని ఇసుక లారీని దూరం పంపించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు ఉన్నతాధికారులకు తెలిపాడు. తన స్నేహితులను రప్పించాడు. శివ సూచన మేరకు వారు ఇసుక లారీ డ్రైవర్ నరసింహ వద్దకు వెళ్లి తాము పోలీసులమని కేసు నుంచి తప్పిస్తామని చెప్పి రూ.20 వేలు తీసుకున్నారు. రూ.15 వేలు శివకు ఇచ్చారు.
తెలిసిందిలా... గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానంతో ఇసుక లారీ డ్రైవర్ నరసింహను అదుపులోకి తీసుకున్నారు. కేసు నుంచి తప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని అతను చెప్పాడు. ఆధారాలు సేకరించిన పోలీసులు హోంగార్డు శివతోపాటు బాలరాజు, డి.శ్రీనుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
భాజపా మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే: హరీశ్రావు
భారాస హయాంలో మెదక్కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్రావు అన్నారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: సీఎం రేవంత్రెడ్డి
అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్