TS News: గురుకులంలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 30 Nov 2021 12:36 IST

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ గురుకులంలో నిన్న 47 మంది విద్యార్థినులు కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా కొవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినా 25 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ముగ్గురికి తీవ్రంగా ఉండటంతో వారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ 25 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పారు. మరోవైపు నిన్న చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుపోయారని గురుకులం ప్రిన్సిపల్‌ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని