Suicide: తప్పనిపించి.. తనువు చాలించి
ప్రేమించాడు.. కాదన్నందుకు హత్యాయత్నం చేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు.. చివరికి తనువు చాలించాడు. గతనెల 28న గచ్చిబౌలిలో యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమోన్మాది ప్రేమ్సింగ్ (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ్సింగ్
జీడిమెట్ల, న్యూస్టుడే: ప్రేమించాడు.. కాదన్నందుకు హత్యాయత్నం చేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు.. చివరికి తనువు చాలించాడు. గతనెల 28న గచ్చిబౌలిలో యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమోన్మాది ప్రేమ్సింగ్ (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీటెక్ చదువుతున్న ప్రేమ్సింగ్ వట్టినాగులపల్లిలో ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమె వద్దన్నదనే కోపంతో అక్టోబరు 28న ఆమె ఇంటికెళ్లి కత్తితో పొడిచి చంపేందుకు యత్నించాడు. ఆమె అరుపులతో మేల్కొన్న ఇంటి సభ్యులు అతన్ని పట్టుకొని చితకబాదారు. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. కాలు విరిగిన అతడు చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఓ గదిలో వేరుగా ఉంటున్నాడు. కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ప్రేమ్ నవంబరు 27 రాత్రి 10 గంటలకు భోజనం తర్వాత గదిలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న కుమారుడ్ని తల్లి పట్టించుకోలేదు. సోమవారం రాత్రి దాకా బయటికి రాకపోవడంతో పిలిచినా పలకకపోవడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని తెలపగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. ఫ్యాన్కు ఉరేసుకుని ప్రేమ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ప్రేమ వైఫల్యమే మృతికి కారణంగా గుర్తించామని జీడిమెట్ల సీఐ బాలరాజు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!