నకిలీ ఆర్సీలతో యాజమాన్య హక్కుల మార్పిడి
వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ (ఆర్సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్...
భద్రాద్రి-కొత్తగూడెం కేంద్రంగా దందా
ఆరుగురి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్, శంషాబాద్, న్యూస్టుడే: వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ (ఆర్సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వివరాలు వెల్లడించారు. అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు చమన్ సతీష్, షేక్ జహంగీర్బాష, కె.చంద్రశేఖర్, ఎం.గణేశ్, సయ్యద్ హుస్సేన్, సీహెచ్.రమేశ్, సంపత్ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తయారు చేసి వాహన యజమానులకు 9 నెలలుగా విక్రయించేవారు.
ఎక్కడెక్కడివారో కలిసి..
చమన్ సతీష్ శంషాబాద్లోని రాళ్లగూడ నివాసి. నకిలీ ఆధార్, ఆర్సీ కార్డుల సృష్టికర్త. రాజేంద్రనగర్కు చెందిన ఎం.గణేశ్ అతడికి సహాయం చేసేవాడు. యూసుఫ్గూడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్ జహంగీర్ బాషాకు పలు రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు అధికారులతో పరిచయాలున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ లొసుగులపై అవగాహన ఉంది. సరైన పత్రాల్లేని వాహనాలకు అనుమతి పత్రాలు ఇప్పించటంలో సిద్ధహస్తుడు. కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్ సంపత్ ఇతడికి అవసరమైన ఆర్సీ కార్డులను సమకూర్చేవాడు. వివిధ కారణాల వల్ల యజమానులకు చేరని కార్డులు రవాణా శాఖ కార్యాలయానికి వెనక్కు వస్తాయి. సంపత్ కొత్తగూడెం, భద్రాద్రిలోని రవాణాశాఖ కార్యాలయాల నుంచి రోజూ 2-3 ఆర్సీ కార్డులను దొంగిలించి, ఒక్కోదాన్ని బాషాకు రూ.200-300కు విక్రయించేవాడు. సతీష్కు అమ్మేవాడు. కిషన్బాగ్కు చెందిన ఆర్టీఏ సయ్యద్ హుస్సేన్ కూడా రవాణాశాఖ కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆర్సీ కార్డులను చోరీ చేసేవాడు. వీటిని వేలంలో వాహనాలను కొనే మియాపూర్కు చెందిన సీహెచ్.రమేష్కు విక్రయించేవాడు.
పాత పేర్లు చెరిపేసి..
డీటీపీ ఆపరేటర్లుగా అనుభవం ఉన్న ఎం.గణేశ్ ఆర్సీ కార్డులపై ఉన్న పేర్లు, నంబర్లు, చిరునామాను చెరిపేసి కొత్త పేర్లను రాసేవాడు. వాటితోపాటు యాజమాన్య బదిలీకి అవసరమైన ఆధార్కార్డులను తయారు చేసి.. రూ.1000-1200 వరకూ విక్రయించేవారు. 9 నెలల వ్యవధిలో 1000 నకిలీ ఆర్సీ కార్డుల ద్వారా వాహనాల యాజమాన్య బదిలీ చేయించినట్టు గుర్తించామని ఎస్వోటీ డీసీపీ సుదీప్ తెలిపారు. ముఠా వద్ద నుంచి 900 నకిలీ ఆర్సీలు, ఖాళీ ఆర్సీ కార్డులు 3000 స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్కు తరలించారు. సంపత్ పరారీలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టీ-సాట్ ప్రత్యేక తరగతులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీ-సాట్ వెల్లడించింది. -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!