నగల దుకాణంలో చోరీ
ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి దొంగలు చొరబడి రూ.60 వేలు విలువైన సొత్తుతో పాటు అందులోని ట్రంకు పెట్టె (తిజోరీ)ను సైతం ఎత్తుకెళ్లిన ఘటన జోగిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం, బాధితులు తెలిపిన వివరాలు.
దుకాణంలోని వస్తువులు చిందరవందర చేసిన దొంగలు
జోగిపేట, న్యూస్టుడే: ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి దొంగలు చొరబడి రూ.60 వేలు విలువైన సొత్తుతో పాటు అందులోని ట్రంకు పెట్టె (తిజోరీ)ను సైతం ఎత్తుకెళ్లిన ఘటన జోగిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం, బాధితులు తెలిపిన వివరాలు.. జోగిపేట పట్టణానికి చెందిన తుపాకుల శేఖర్ కొన్నేళ్లుగా పట్టణంలోని ప్రధాన రహదారి సినిమా థియేటర్ లైనులో కనకదుర్గ నగల దుకాణం నడుపుతున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణానికి వెళ్లిన శేఖర్ చోరీ జరిగినట్లు గుర్తించి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ మొదలెట్టారు. దొంగలు అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లని కారులో దుకాణం వద్దకు చేరుకుని తాళాలు పగులగొట్టారు. కౌంటర్లో ఉన్న రూ.17 వేలు నగదు, పూజ కోసం వినియోగించే వెండి బిల్లలతోపాటు అక్కడే ఉన్న తిజోరీని కారులో పెట్టుకొని ఉడాయించారు. పుల్కల్ మండలంలోని పెద్దరెడ్డిపేట శివారుకు వెళ్లి తిజోరిని పగలగొట్టి అందులోని అర కిలో వెండి వస్తువులు తీసుకుని దానిని అక్కడే వదిలేసి వెళ్లారు. పట్టణంలోని ప్రధాన దారిపై ఉన్న దుకాణంలోనే చోరీ జరగడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ దొంగలు సమీపంలోని మరో దుకాణం తాళాలు పగలగొట్టడానికి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. ఆ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM