TS News: ఉప్పల్‌ భగాయత్‌లో ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.474 కోట్ల ఆదాయం

ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.474 కోట్ల ఆదాయం లభించింది. మొదటి రోజు గరిష్టంగా

Published : 04 Dec 2021 01:28 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.474 కోట్ల ఆదాయం లభించింది. మొదటి రోజు గరిష్టంగా చదరపు గజం లక్ష రూపాయలకు పైగా పలికింది. రెండో రోజైన ఇవాళ జరిగిన వేలంలో గరిష్టంగా గజం రూ.72వేలు పలికింది. కనిష్టంగా రూ.36వేలు ధర పలికినట్టు అధికారులు తెలిపారు. 65,247 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 16 ప్లాట్ల వేలంతో ఇవాళ రూ.333 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి రోజు రూ.141. 61 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 84,966 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 39 ప్లాట్ల విక్రయంతో హెచ్ఎండీఏకు రూ.474.61 కోట్ల  ఆదాయం సమకూరింది. సగటున గజం రూ. 55,859 రూపాయలు పలికింది. 

తొలి రోజు ఇలా..

ఈ-వేలంలో అధికారుల అంచనాలను దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంకంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01 లక్షల రికార్డు ధర పలికాయి. ఒక ప్లాటును కనిష్ఠంగా రూ.53 వేలకు పాడారు. చదరపు గజానికి రూ.35 వేల నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాట్‌ అత్యధికంగా చదరపు గజానికి రూ.77 వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01 లక్షల ధరలు పలికాయి. సగటున గజానికి రూ.71,815 ధర వచ్చింది. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది.  జరిగిన ఈ ప్రక్రియలో..  ప్రవాసీయులతో పాటు స్థానిక రియల్టర్లు నువ్వా నేనా అన్నట్లుగా ధరలు పెంచుకుంటూ పోయారు. తొలిరోజు 19 వేల చదరపు గజాల వేలంలో రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని