TS News: ధాన్యం కొనుగోలుపై కేసీఆర్‌ కీలక సమీక్ష

ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు

Updated : 04 Dec 2021 15:30 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో తెరాస ఎంపీలు గళమెత్తుతున్న వేళ నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ వారితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని