ఆర్థిక సాయం... అన్నదాతకు ప్రయోజనం
సాధారణంగా అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్ కార్డు’లను
అండగా నిలిచే ‘కిసాన్ క్రెడిట్ కార్డులు’
న్యూస్టుడే, వికారాబాద్
సాధారణంగా అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్ కార్డు’లను మంజూరు చేస్తున్నాయి. ఇదే తరహాలో రైతుకు కూడా అవసరానికి ఉపయోగపడేలా కేంద్రం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ (కెసిసి)ను గతంలోనే ప్రవేశపెట్టింది. దీని గురించి సరైన అవగాహన లేక అధిక శాతం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి కార్డు మార్గదరకాలను, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సాయాన్ని లబ్ధిదారుడు ఎప్పుడైనా పొందేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అవసరమున్నప్పుడు తీసుకునేలా..
కేంద్రం కిసాన్ సమ్మాన్నిధి కింద ఏటా మూడుసార్లు రూ.2 వేల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతుకు ఆర్థిక సాయమందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు ఈ మొత్తం బ్యాంకుల ద్వారా చేతికందుతోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం కూడా మంజూరవుతోంది. దీనినీ బ్యాంకు నుంచే చెల్లిస్తున్నారు. అయితే రైతు తనకు అవసరమున్నప్పుడే నగదు తీసుకొని వాడుకునేలా 1998లోనే ‘కిసాన్ క్రెడిట్ కార్డు’లను ప్రవేశపెట్టింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుకు ముందస్తుగా తీసుకునేందుకు వారికున్న పరిమితి మేర ఈ కార్డు చెల్లుబాటయ్యే వీలు కల్పించారు.
ఇప్పటికి 50 వేల మందికి జారీ
జిల్లాలో మొత్తం 2.39 లక్షల మంది రైతులున్నారు. ఇందులో అన్ని అర్హతలుండి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 1.9 లక్షల మంది ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పాటికే 50 వేల వరకు రూపే కార్డులు, కేసీసీ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా సుమారు 1.5 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని జాతీయ, వాణిజ్య, ప్రైవేటు, గ్రామీణ, సహకార బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందించేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ ప్రయోజనాలు వర్తించే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఐదేళ్ల కాలపరిమితి..
భూమి ఉండి 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న రైతులు ఈ కార్డు పొందే వీలుంది. తమ దగ్గరలో ఖాతా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకును సంప్రదించొచ్ఛు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డుతో పాటు (ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్సు.. తదితర ఏదైనా) భూమి పాసుపుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ కేంద్రాల్లోనూ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు పత్రాలు పొందొచ్ఛు వివరాలన్నీ సరిచూసుకుని సంబంధిత బ్యాంకులు ఐదేళ్ల కాల పరిమితితో కూడిన ఈ కార్డులను మంజూరు చేస్తాయి. వ్యక్తిగత రహస్య కోడ్ను అందిస్తారు.
అధిక వడ్డీ బాధలు ఉండవు: గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
రైతులకు పంట సాయం సకాలంలో చేతికందని పరిస్థితుల్లో కేసీసీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. అర్హత ఉన్న రైతులందరికీ దశల వారీగా ఈ కార్డులు చేరేలా చూస్తాం. బ్యాంకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఆయా బ్యాంకులకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు