మెరిసిన పల్లె కుసుమాలు
అభిరుచికి ప్రతిభ తోడైతే గెలుపు ఇట్టే సాధ్యం.. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ అవసరం.. ఈ దిశగా అడుగేసి విజేతలుగా నిలవడం విశేషం. ఇటీవల కళాఉత్సవ్ పోటీలను వివిధ స్థాయిలో
జాతీయ స్థాయి కళాఉత్సవ్ పోటీలకు పలువురు ఎంపిక
న్యూస్టుడే, మెదక్, చేగుంట, శివ్వంపేట, హత్నూర, వికారాబాద్ టౌన్
అభిరుచికి ప్రతిభ తోడైతే గెలుపు ఇట్టే సాధ్యం.. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ అవసరం.. ఈ దిశగా అడుగేసి విజేతలుగా నిలవడం విశేషం. ఇటీవల కళాఉత్సవ్ పోటీలను వివిధ స్థాయిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ముందుగా మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. గత నెలలో సదరు పోటీలు జరగ్గా ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
దరువు వేశారంటే..
ఆ విద్యార్థిని దరువు వేయడంలో మంచి నేర్పరి. అందులో తనకు తానే సాటి. ఎలాంటి దరువునైనా అవలీలంగా మోగించడం ఆమెకు సులువే. ఎడమ చేతివాటంతో వాయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలో ఏర్పడిన ఇష్టంతో ముందడుగు వేసి రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విద్యార్థినే నర్సాపూర్ మండలం జాన్ఖాన్పేటకు చెందిన మన్నె జగన్, శశికళ దంపతుల కుమార్తె అక్షయ. ప్రస్తుతం ఈ కుటుంబం హత్నూర మండలం దౌల్తాబాద్లో నివాసముంటోంది. అక్షయ హత్నూర కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నారు. ఆమెలోని తృష్ణను గుర్తించిన ఉపాధ్యాయులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో కళా రంగంలో తన ప్రతిభను చాటుతూ ఎదుగుతున్నారు. దరువుకు అనుగుణంగా అడుగులేస్తూ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. గత నెలలో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పొటీల్లో జడ్జిల ప్రశంసలు అందుకొని జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థానానికి చేరానని, జాతీయ స్థాయిలో ఇదే స్ఫూర్తిగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని చెబుతున్నారు అక్షయ.
ఆసక్తితో అడుగేసి..
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కర్రె సందీప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇతడి తల్లిదండ్రులు రేణుక, బాబు. వీరికి ముగ్గురు సంతానం కాగా, కూతురు మీన, కుమారులు సందీప్, నిఖిల్. అమ్మానాన్నలు కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జానపద వాయిద్యం డప్పు కొట్టడమంటే సందీప్కు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితో ముందుగా సొంతంగా నేర్చుకున్నాడు. ఇతడి అభిరుచిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజయ్య, ఉపాధ్యాయురాలు ఇందుమతి మరింత ప్రోత్సహించారు. ఇదే క్రమంలో గజ్వేల్కు చెందిన డోలక్ యాదయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. అందుకు వారే ఆర్థిక సాయం చేయడం గమనార్హం. ఇలా వారి సహకారంతో మెలకువలు నేర్చుకున్న సందీప్.. చిన్నశంకరంపేట ఆదర్శ పాఠశాలలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. తద్వారా జాతీయ స్థాయికి ఎంపికై తన ప్రతిభ చాటడం విశేషం.
సుమధుర గాయని ‘శర్వాణి’
శర్వాణి.. పాట పాడిందంటే అక్కడి నుంచి కదలకుండా వినాల్సిందే. నిరంతర సాధన, ఆసక్తితో ఈ దిశగా అడుగేసిన ఈ అమ్మాయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈమె స్వగ్రామం మెదక్ జిల్లా నార్సింగి. తల్లిదండ్రులు సరస్వతి, లక్ష్మణాచారి. తల్లి గృహణి కాగా, తండ్రి టీవీ మెకానిక్. శర్వాణికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం రామాయంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మూడో తరగతి నుంచి పాటలు పాడటం నేర్చుకున్న ఈ గాయని వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. గత నెలలో చిన్నశంకరంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలో పాల్గొని మంత్రముగ్ధుల్ని చేసి ఏకంగా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాలగాయనిగా రాణిస్తున్న సమయంలో ఈమెను ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. 2018లో ‘ఈటీవీ’ పాడుతా తీయగా కార్యక్రమంలో పాటలు పాడి గానగంధర్వుడు ఎస్పీ బాలు ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ సంగీత శిక్షకులు రామాచారి శిష్యరికంలో మరింత రాటుదేలారు. వీణ వద్ద కర్ణాటక, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఇల్లు కూడా సరిగా లేకపోవడంతో కొత్త ఇంటి నిర్మాణానికి రామాచారి ఆర్థిక సాయం చేశారు. ఇటీవల శర్వాణి పాడిన ఓ పాటను విన్న మంత్రి కేటీఆర్ ప్రశంసిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఎస్ఎస్ తమన్కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన దేవిశ్రీప్రసాద్ ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాడే అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడనున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహం, గురువుల సహకారంతో మరింత ముందుకు సాగుతానని, సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా సత్తా చాటుతానని చెబుతున్నారు ఈ గాయని.
నృత్యం అదరహో..
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ గిరి పుత్రిక. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎన్.సవితకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. ఇష్టంతో నేర్చుకొని ముందుకు సాగారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా కేంద్రం వికారాబాద్ డైట్ కళాశాలలో నవంబరు 23 నుంచి 26 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గన్నారు. లంబాడీ నృత్యంతో అదరగొట్టాడారు. ఇలా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మరోవైపు చదువులోనూ ఈ విద్యార్థిని ముందు స్థానమే కావడం గమనార్హం. మారుమూల గ్రామం చాకల్పల్లి తండా ఈమె స్వగ్రామం. రవాణా సౌకర్యం సరిగా లేని ఈ ప్రాంతం నుంచి కాలినడకన బడికి వచ్చి వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్నారు ఈ విద్యార్థిని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో