చిత్ర వార్తలు
గర్భిణుల్లో ఒత్తిడి తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కిమ్స్ కడుల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హెచ్ఐసీసీలో నిర్వహించిన మిసెస్మామ్ కాంటెస్ట్ ఉత్సాహభరితంగా సాగింది. కాబోయే తల్లుల ఫ్యాషన్షో ఆకట్టుకుంది.
కాబోయే అమ్మలు.. ఆత్మవిశ్వాసపు అడుగులు
గర్భిణుల్లో ఒత్తిడి తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కిమ్స్ కడుల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హెచ్ఐసీసీలో నిర్వహించిన మిసెస్మామ్ కాంటెస్ట్ ఉత్సాహభరితంగా సాగింది. కాబోయే తల్లుల ఫ్యాషన్షో ఆకట్టుకుంది. సినీనటుడు మంచు విష్ణు దంపతులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
-న్యూస్టుడే, మాదాపూర్
మార్జాల వయ్యారం
మార్స్పెట్కేర్, వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్, రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం మాసబ్ట్యాంకు వెట్స్హోమ్లో నిర్వహించిన క్యాట్షో-2021 అలరించింది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఎన్.రామచందర్ అతిథిగా హాజరయ్యారు.
-ఈనాడు, హైదరాబాద్
ఆలపించి.. అలరించి!
కుతుబ్షాహీ హెరిటేజ్ పార్కులో ఆదివారం జరిగిన 4వ అంతర్జాతీయ జాజ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జర్మన్ అంబాసిడర్ వాల్టర్జే లిండర్ ఫ్లూట్ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-న్యూస్టుడే, గోల్కొండ
జలవనరుల్లో వ్యర్థం.. జలచరాలకు అనర్థం
చెరువుల్లో కలుస్తున్న వ్యర్థాలు చేపల పాలిట శాపంగా మారుతున్నాయి. కాలుష్య నీటితో ప్రాణవాయువు తక్కువవుతుండడంతో ఆహారం లభించడం గగనమవుతోంది. దీంతో ప్లాస్టిక్ సంచుల్లోని ఆహారం కోసం పోటీపడుతున్నాయి. హయత్నగర్ బాతులచెరువు వద్ద కనిపించిందీ దృశ్యం.
గోడపై గీతలు కావివి.. భావి తరాలకు బాటలు
పిచ్చిరాతలు, సినిమా పత్రికలు, ప్రకటనలు అంటిస్తూ గోడలను ఆగం చేస్తున్నారు కొందరు. దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు చాటిచెప్పేందుకు ఉస్మానియా వర్సిటీ అధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు. గోడలపై బోనాలు, బతుకమ్మ, పల్లె వైభవాన్ని ప్రతిబింబించే చిత్రాలను గీయిస్తున్నారు. మహిళా వసతి గృహాల చెంత గీయించిన చిత్రాలివి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ