Shilpa Chowdary: ఆస్పత్రి ఎక్కడ? రూ.కోట్ల జాడెక్కడ?
అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు
ఫోన్కాల్ జాబితా ఆధారంగా పోలీసుల కూపీ
పలువురికి నోటీసులు జారీ
ఈనాడు, హైదరాబాద్: అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు ఈ కేసులో జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. శిల్పాచౌదరి తన వద్ద రూ.1.50 కోట్లు అప్పు తీసుకుని తిరిగి అడిగితే బెదిరిస్తున్నట్టు నవంబరు 13న దివ్యారెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే నెల 26న శిల్పాచౌదరి దంపతులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణకు సమయం ఎక్కువ తీసుకున్నారనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం కరవైంది. ఆమెను రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నా పూర్తి ఆధారాలు సేకరించలేకపోయారు. నిందితురాలి రెండు చరవాణుల్లో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. బాధితుల జాబితాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కుటుంబాలకు చెందిన వారున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవటంతో సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఆసుపత్రి ఎక్కడ.. కోట్ల జాడెక్కడ...
శిల్ప పక్కా పథకం ప్రకారమే మోసాలకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ నటుడు మహేష్బాబు సోదరి ప్రియదర్శిని వద్ద తీసుకున్న రూ.2.90 కోట్లకు చెల్లని చెక్కులు, నకిలీ బంగారు ఆభరణాలను ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. చెక్లను మార్చుకునేందుకు ప్రయత్నించినపుడు సంబంధిత బ్యాంకు ఖాతా ఎప్పుడో రద్దయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. అప్పటికి కానీ తాను మోసపోయినట్టు గ్రహించలేకపోయానంటూ ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. శిల్పాచౌదరి బ్యాంకు ఖాతాల్లో రూ.వేలల్లో మాత్రమే నగదు నిల్వలున్నాయి. బాధితులు ఒక్కొకరు రూ.కోట్లలో ఇచ్చినట్టు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారేటపుడు ఆదాయపన్ను శాఖ గుర్తించే వీలుంది. ఈ కేసులో మాత్రం బ్యాంకు ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లభించలేదని సమాచారం. నిందితురాలు చెప్పినట్టు ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ చేపట్టారు. ఎక్కడ భూములు కొనుగోలు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. విచారణకు హాజరయ్యేవారి ద్వారా సేకరించే ఆధారాలు ఈ కేసులో ముందుకెళ్లేందుకు కీలకం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు