logo

మూడు కిలోల గంజాయి స్వాధీనం

గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పంజాగుట్ట పోలీసులు మాటు వేసి మూడు కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం...

Updated : 06 Dec 2021 06:36 IST

ఇద్దరి అరెస్టు 

పంజాగుట్ట, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పంజాగుట్ట పోలీసులు మాటు వేసి మూడు కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కర్నేడి రవితేజ కూకట్‌పల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐడీఏ బొల్లారంలో నివాసం ఉండే గోకర్ల పాపారావు, కార్తిక్‌ అలియాస్‌ నాని చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ గంజాయి క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఆదివారం సాయంత్రం కార్తిక్‌ మూడు కేజీల గంజాయి తీసుకువచ్చి అమీర్‌పేట బిగ్‌ బజార్‌ వద్ద రవితేజ, పాపారావులకు ఒక కేజీ రూ.6వేల చొప్పున విక్రయించాడు. ఇదే సమయంలో పోలీసులు దాడి చేయగా కార్తిక్‌ తప్పించుకున్నాడు. రవితేజ, పాపారావులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్‌.ఐ. తెలిపారు. పరారీలో ఉన్న కార్తిక్‌ కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని