logo

దోమకొండ గడీకోటలో పోచమ్మ పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడీకోటలో సంస్థానాధీశుల వారసులు కామినేని అనిల్‌కుమార్‌- శోభన రెండో కుమార్తె అనుష్పల వివాహాన్ని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం ఆదివారం పోచమ్మ పండగ నిర్వహించారు.

Published : 06 Dec 2021 04:23 IST


వధూవరులతో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు

దోమకొండ, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడీకోటలో సంస్థానాధీశుల వారసులు కామినేని అనిల్‌కుమార్‌- శోభన రెండో కుమార్తె అనుష్పల వివాహాన్ని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం ఆదివారం పోచమ్మ పండగ నిర్వహించారు. కోటలోని మైసమ్మతో పాటు గ్రామంలోని పోచమ్మకు పూజలు చేశారు. అమ్మవారికి వధువు పెళ్లి దుస్తులు చూపించి నైవేద్యాలు సమర్పించారు. వధువు అక్కాబావలు ఉపాసన, రామ్‌చరణ్‌, అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి(తాతయ్య), జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని