logo

జీవితంపై విరక్తి చెంది..ఉరేసుకుని ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో సోమవారం చోటు చేసుకుంది. సిద్దిపేట

Published : 07 Dec 2021 01:22 IST

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో సోమవారం చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణ మూడో ఠాణా ఎస్‌ఐ కొమురయ్య తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాయలపురం మల్లయ్య (55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఐదు సంవత్సరాల క్రితం చెట్టుపై నుంచి కింద పడటంతో తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయి. వైద్యం చేయించినా నయం కాలేదు. తన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు చెబుతూ తరచూ మదన పడుతుండేవాడు. జీవితంపై విరక్తితో ఇంటి వెంటిలెటర్‌కు ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. గమనించిన తెలిసిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటున్న మృతుడి భార్య యాదమ్మకు చరవాణిలో సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని