సుద్ద పరిశ్రమలో ప్రమాదం.. యువకుడి మృత్యువాత
మండలంలోని మారేపల్లి సమీపంలోని ఆగ్రో సుద్ద పరిశ్రమలో ప్రమాదం జరిగి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఎస్సై నారాయణ తెలిపారు. రాజస్థాన్కు చెందిన ముఖేù్, నవీన్,
సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న ఏఎస్సై నారాయణ
పెద్దేముల్, న్యూస్టుడే: మండలంలోని మారేపల్లి సమీపంలోని ఆగ్రో సుద్ద పరిశ్రమలో ప్రమాదం జరిగి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఎస్సై నారాయణ తెలిపారు. రాజస్థాన్కు చెందిన ముఖేù్, నవీన్, మనోజ్సింగ్ సుద్ద పరిశ్రమలో పని చేసేందుకు కుదిరారు. సోమవారం ఉదయం సూపర్వైజర్ ముఖేష్ విధులు ముగించుకుని, మరో సూపర్వైజర్ నవీన్కు బాధ్యతలు అప్పగించాడు. జేసీబీని నడిపే డ్రైవర్ సమయానికి రాకపోవడంతో పని ఆలస్యం అవుతోందని హెల్పర్ మనోజ్సింగ్ (18)కు స్టార్ట్ చేయాలని ఆదేశించాడు. యంత్రానికి సంబంధించిన తాళం లేకపోవడంతో మనోజ్సింగ్ జేసీబీ కిందికి వెళ్లి తీగలను కలిపి స్టార్ట్ చేశాడు. దీంతో యంత్రం ఒక్కసారిగా ముందుకు కదలడంతో, కింది భాగంలో ఉన్న మనోజ్సింగ్ తలపై నుంచి వెళ్లి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. నవీన్ బాధ్యతారహితంగా వ్యవహరించాడని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!