logo

శిల్పాచౌదరి కస్టడీకి కోర్టులో మళ్లీ పిటిషన్‌

పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆభియోగాలు ఎదుర్కొంటున్న గండిపేటకు చెందిన శిల్పాచౌదరిని మరో ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సోమవారం

Published : 07 Dec 2021 02:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆభియోగాలు ఎదుర్కొంటున్న గండిపేటకు చెందిన శిల్పాచౌదరిని మరో ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సోమవారం ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని విచారించారు. విచారణలో సేకరించిన సమాచారం, నిందితుల కాల్‌డేటా ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. ఆధారాలు ఇస్తారని భావించిన పోలీసులకు బాధితులు ఊహించని ఝలక్‌ ఇచ్చారు. వారంతా ముఖం చాటేయటంతో మరోసారి తాఖీదులు జారీ చేయాలనుకుంటున్నారు. సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు శిల్ప నిర్వహించిన కిట్టీ పార్టీలో తరచూ పాల్గొనేవారు. వీరు ఓ పోలీసు ఉన్నతాధికారిని కలిసినట్టు తెలిసింది. శిల్పాచౌదరి తాను సేకరించిన సొమ్మును ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులకు ఇచ్చినట్టు చెప్పిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని