ఇక్కడ పోగుచేసి.. పొరుగు రాష్ట్రాలకు
నగరం నుంచి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇతర జిల్లాల్లో పట్టుకుంటున్నారు. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
పక్క జిల్లాల్లో స్వాధీనం చేసుకుంటున్న అధికారులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
నగరం నుంచి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇతర జిల్లాల్లో పట్టుకుంటున్నారు. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నా దందాకు అడ్డుకట్ట పడటంలేదు. గ్రేటర్ పరిధిలో పౌరసరఫరాల శాఖ అధికారులు జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 400 కుపైగా కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా కార్డుదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యంను అక్రమ మార్గంలో తరలించడం సర్వసాధారణమైపోయింది. చిల్లరగా వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి వాటిని పెద్ద మొత్తంలో లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
బాహ్యవలయ రహదారి మీదుగా...
నగరంలో వివిధ ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటుచేసుకుని అక్కడి నుంచి బాహ్యవలయ రహదారి మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జహీరాబాద్, మెదక్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి సీజ్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం నగరం నుంచి గుజరాత్కు అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇటీవల 36 టన్నుల రేషన్ బియ్యాన్ని జహీరాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో పోగు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 530 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ప్రతినెలా కొన్ని వందల క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నారు.
లబ్ధిదారుల నుంచే సేకరణ...
నగరంలోని కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి వ్యక్తికి పది కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఈ బియ్యం తినని ఒక్కో కుటుంబం నుంచి 40 కిలోలకు మించకుండా సేకరిస్తున్నారు. రేషన్ దుకాణంలో తీసుకున్న కార్డుదారులు.. డీలర్లకు లేదా తమ వద్దకు వచ్చే చిరువ్యాపారులకు కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నారు. ఇలా పోగైన బియ్యాన్ని మరో వ్యాపారికి రూ.10 నుంచి రూ.12 వరకు, అక్రమ దందాలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి అంతిమంగా రూ.15 వెచ్చించి కొనుగోలు చేసి..ఇతర రాష్ట్రాల్లో రూ.20 అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వివిధ ఆహార పదార్థాల తయారీలో వీటిని వాడుతుంటారు. నాణ్యత లేని వాటిని దాణా తయారీకి వినియోగిస్తుంటారని తెలిసింది. కొంతకాలంగా ఈ దందా జరుగుతున్నప్పటికీ అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రధాన పాత్రధారులపై దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకుంటాం
- ఎ.రమేశ్, డీఎస్వో
నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెడుతున్నాం. ప్రజా పంపిణీకి సంబంధించి బియ్యం కొనుగోలు చేసినా, విక్రయించినా నేరం. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. కార్డులు రద్దు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్