దూరానికి దూరం.. లేదు కరోనా భయం
ఓ వైపు కొవిడ్ కొత్తరకం ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా జూనియర్ కళాశాలలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. తరగతి గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి.
ఇంటర్ కళాశాలల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులు
ఓ కళాశాలలో బెంచీకి ముగ్గురేసి చొప్పున కూర్చున్న విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: ఓ వైపు కొవిడ్ కొత్తరకం ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా జూనియర్ కళాశాలలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. తరగతి గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి.
1.9లక్షల మంది.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో కలిపి దాదాపు 870 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 1.90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడు జిల్లాల్లో 42 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 18,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. ఈ ఏడాది పదో తరగతిలో విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికంగా విద్యార్థులు ఇంటర్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ఒక్క ప్రభుత్వ కళాశాలల్లోనే గతేడాది పోల్చితే 4,500 మంది విద్యార్థులు అధికంగా చేరారు. నగరంలోని మహబూబియా, నాంపల్లి, కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, హుస్సేనీఆలం, సైదాబాద్ కళాశాలల్లో ఒక్కో బెంచీకి నలుగురు చొప్పున కూర్చుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం ఇంటర్, సాయంత్రం డిగ్రీ తరగతులు జరుగుతున్నాయి.
శానిటైజేషన్ ఎక్కడ.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో తరగతులు ముగిశాక శానిటైజేషన్ చేయాలి. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా జరగకపోగా.. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. నారాయణగూడ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.
ఇలా అడ్డుకుంటున్నాయ్
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో నగరంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాల సంక్షేమ సంఘాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించి వ్యాప్తిని అడ్డుకుందామని తమ సభ్యులకు సూచిస్తున్నాయి. ‘మా కమ్యూనిటీలో మొన్నటి వరకు ఒక కేసు లేదు. ప్రస్తుతం మూడు కేసులున్నాయి. అప్రమత్తం చేస్తూ అందరికి సంక్షిప్త సందేశాలు పంపించాం’ అని గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమ సంఘం ప్రతినిధి తెలిపారు. ః మాస్క్లులేని, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోని డెలివరీ బాయ్స్ను, వెండర్లను లోపలికి అనుమతించవద్దని సూచించాయి.
- ఈనాడు, హైదరాబాద్
బూస్టర్కు పయనం!
ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో బూస్టర్ డోసు తెరపైకి వచ్చింది. కొందరు వైద్యులను సంప్రదించి ప్రైవేటు కేంద్రాల్లో మూడోదఫా టీకా వేయించుకుంటున్నారు. గతంతో పోల్చితే తొలి, రెండు, మూడో డోసుల కోసం వచ్చేవారితో ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాలు రద్దీగా కన్పిస్తున్నాయి.
* బూస్టర్ డోసుపై ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో వైద్యులు కచ్చితంగా సూచించలేకపోతున్నారు. వివిధ దేశాలకు సంబంధించి పలు సంస్థల పరిశోధన పత్రాల ఆధారంగా మాత్రమే తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
* రెండు డోసు వేయించుకున్న కనీసం ఆరు నెలలు గడిచాకే బూస్టర్ డోసు తీసుకోవాలని కాంటినెంటల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ గోపాల్ పాలెపు సూచించారు.
- ఈనాడు, హైదరాబాద్
శుభ్రత చర్యలు చేపట్టాలి
- పి.శ్రీహరి, ఏబీవీపీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులు
ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ పరిశుభ్రత పాటించాలి. తరగతి గదుల సంఖ్య పెంచి విద్యార్థులను దూరంగా కూర్చొపెట్టాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శుభ్రత చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!