logo

నగరంలో నిషాదగీతం

సరిగ్గా రెండు నెలల క్రితం మాదాపూర్‌ ఠాణా పరిధిలోని ఓ ట్రాఫిక్‌ కూడలి వద్ద ఆగి ఉన్న బైక్‌ను కారు వేగంగా ఢీకొట్టగా వెనుక కూర్చున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మరియా

Published : 07 Dec 2021 02:38 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, గచ్చిబౌలి: సరిగ్గా రెండు నెలల క్రితం మాదాపూర్‌ ఠాణా పరిధిలోని ఓ ట్రాఫిక్‌ కూడలి వద్ద ఆగి ఉన్న బైక్‌ను కారు వేగంగా ఢీకొట్టగా వెనుక కూర్చున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మరియా డీక్రూజ్‌ అక్కడికక్కడే చనిపోయింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న సృజన్‌ కుమార్‌ ఈ ప్రమాదం చేశాడని పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్‌ చేశారు.

పగలూరాత్రి తేడా లేకుండా చిత్తుగా మద్యం తాగుతున్న వాహనదారులు యమకింకరులుగా మారుతున్నారు. రాత్రివేళల్లో గమ్యస్థానాలను చేరుకుంటున్న వారిని, రహదారులను దాటుతున్న పాదచారులను ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుతుపున్న వారు టెర్రరిస్టులకంటే దారుణమంటూ కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. శిక్షలు విధిస్తున్నా... డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తున్నా.. ప్రమాదాల పరంపర ఆగడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని