తప్పులను ఒప్పుకొని ఈటల ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్
పేదలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు తేలినందున మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ ...
హైదరాబాద్: పేదలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు తేలినందున మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. జమునా హేచరీస్ 70 ఎకరాలు కబ్జా చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ కలెక్టర్పై ఈటల కుటుంబీకులు చేసిన ఆరోపణలు సరికాదని.. ప్రభుత్వ, పేదల భూములు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలన్నారు. ఈ విషయంలో రాబోయే రోజుల్లో చట్టపరంగా ఏమేం జరగాలో అవన్నీ అవుతాయని సుమన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు