logo

కోతుల సంచారంతో అన్నదాతల అవస్థలు

జిల్లాలో కోతుల సంచారంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, పంటలపై దాడి చేయడంతో నష్టపోతున్నారని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌ను

Published : 08 Dec 2021 00:51 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లాలో కోతుల సంచారంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, పంటలపై దాడి చేయడంతో నష్టపోతున్నారని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలనాధికారిణికి వినతిపత్రం పంపించారు. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రధానంగా కూరగాయలు, పత్తి, వేరుసెనగ, మొక్కజొన్న పంటలపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రోగ్రెసివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ తరఫున బోను తయారు చేసి సంస్థ సభ్యులకు ఇచ్చామన్నారు. యువతకు వాటిని ఏ విధంగా పట్టుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చామని, ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖాధికారులకు తెలిపామన్నారు. కలెక్టర్‌ నిధుల నుంచి కొంత మొత్తాన్ని జిల్లా అటవీశాఖాధికారులకు మంజూరు చేయాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని