సంక్షిప్త వార్తలు
బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు
బలవంతంగా కెన్యాకు తరలిస్తున్నారంటూ ఫిర్యాదు
శంషాబాద్, న్యూస్టుడే: బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం..నేపాల్కు చెందిన తమాంగ్ను ఓ వ్యక్తి బలవంతంగా నైరోబీకి తరలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి వచ్చిన ఆమె భద్రతాధికారులను ఆశ్రయించింది. ఆమె ప్రవర్తనను గమనించిన సదరు వ్యక్తి పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
ఖైరతాబాద్, న్యూస్టుడే: ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ టెండర్ ప్రక్రియలో టీఎస్09 ఎఫ్టీ 9999 నంబరును రూ.20.10లక్షలు చెల్లించి కీస్టోన్ ఇన్ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. కొత్త సిరీస్లో టీఎస్09 ఎఫ్యూ 0009 నంబరుకు ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ రూ.7.95 లక్షలు చెల్లించగా, 0001 నంబరును రాధికరెడ్డి పెరటి రూ.3.08లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. హైదరాబాద్ జిల్లా రవాణా శాఖకు రూ.46,14,824 ఆదాయం చేకూరిందని జేటీసీ పాండురంగ నాయక్ తెలిపారు.
తాగునీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం
రాంనగర్, న్యూస్టుడే: రాంనగర్ డివిజన్ ఎస్సార్కేనగర్ ప్రాంతంలోని జలమండలికి చెందిన 50 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం(25) ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్, డీఐ వెంకన్న, సెక్టార్ ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్ఎంసీ అత్యవసర విభాగం డీఆర్ఎఫ్ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు వారం, పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హత్య.. ఆత్మహత్య
వాటర్ ట్యాంకు లోపలికి వెళ్లడానికి రెండు ద్వారాలు ఉన్నాయి. వాటికి మూతలు వేసి ఉన్నాయని ట్యాంకును శుభ్రం చేయడానికి వెళ్లిన కూలీలు తెలిపారు. రెండు ద్వారాలకు మూతలు వేసి ఉండటంతో మృతుడితోపాటు మరొకరు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి ఉంటే మూతలు ఎలా పెట్టి ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకుపై జత చెప్పులు ఉన్నాయి. కేసు దర్యాప్తులో అవి కీలకంగా మారనున్నాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెన్ శ్రీనివాస్, కార్పొరేటర్ రవిచారి, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మందుబాబులపై 65వేల కేసులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, రాయదుర్గం: మోతాదు మించి మద్యం తాగుతూ వాహనాలు నడుపుతున్న వారిపై మూడు పోలీస్ కమిషనరేట్లలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకు 65 వేల కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 36 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రహదారి భద్రతపై మంగళవారం ట్రాఫిక్ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఎక్సైజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాదాపూర్ జోన్ పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు నమోదవుతున్నందున ఆ జోన్లో ప్రమాదాలు తగ్గించేందుకు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం లైసెన్సులు రద్దు చేయించేందుకు రవాణా శాఖ అధికారులో ఎప్పటికప్పుడు సంప్రదించాలని తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలతో పాటు, రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగింత
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్కు చెందిన మహిళ ఇంట్లో స్నానం చేస్తోంది. పక్కింటికి వచ్చిన ఇంటర్నెట్ కంపెనీ టెక్నీషియన్ ఆమెను చూసి బాత్రూం కిటికీనుంచి చరవాణిలో వీడియో తీయడం ప్రారంభించాడు. గమనించిన మహిళ వెంటనే కుమారుడికి తెలియజేయడంతో అతడు సదరు వ్యక్తిని పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి విచారించారు. మల్లేపల్లి ఇందిరానగర్కు చెందిన ఓ ఇంటర్నెట్ కంపెనీ టెక్నీషియన్ మార్టిన్(19)గా గుర్తించారు. బాధితురాలి భర్త పిర్యాదుతో కేసు నమోదుచేశారు.
‘లక్ష యువగళ గీతార్చన’ 14న
సుల్తాన్బజార్, న్యూస్టుడే: వైకుంఠ ఏకాదశి, గీతా జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న ఎల్బీస్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు తెలిపారు. మంగళవారం కోఠిలోని వీహెచ్పీ కార్యాలయంలో కార్యదర్శి బండారి రమేష్, గీతార్చన కార్యక్రమం కన్వీనర్ వెంకటేశ్వరరాజు, భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్చందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్గిరి, కార్యదర్శి చంపత్రాయ్, త్రిదండి చినజీయర్స్వామి, పెజావర్ మఠ్కు చెందిన విష్యప్రసన్న తీర్థ్ మహారాజ్, వీహెచ్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హాజరవుతారన్నారు.
న్యాయవాదుల సారథి సునీల్గౌడ్
ఈనాడు, హైదరాబాద్: అఖిల భారత న్యాయవాదుల క్రికెట్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లాయర్ల సంఘం జట్టుకు సునీల్గౌడ్ సారథ్యం వహించనున్నాడు. ఈనెల 23 నుంచి 28 వరకు కటక్లో టోర్నీ జరుగుతుంది. జట్టు: సునీల్గౌడ్ (కెప్టెన్), రాజగోపాల్రెడ్డి, రఘువీరారెడ్డి, గోవింద్రెడ్డి, సయ్యద్ మన్సూర్, పవన్కుమార్ ఆదిత్య, సుమన్గౌడ్, సంచిత్ భంగ్, కహిలిద్ బిన్ సయీద్, ఉన్నం కృష్ణ, రాహుల్ తపాడియా, సాయిచంద్, అబ్దుల్ మతిన్ ఖురేషి, స్వామి, మనోహర్, హరిందర్, బాల గోపేందర్నాథ్ (మేనేజర్), ప్రవీణ్ (కోచ్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ