logo

బాలికపై సామూహిక అత్యాచారం

ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. కాచిగూడ ప్రాంతానికి చెందిన

Published : 08 Dec 2021 03:06 IST

ఆలస్యంగా వెలుగుచూసిన దుర్ఘటన

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. కాచిగూడ ప్రాంతానికి చెందిన బాలిక(17) కోఠి ప్రాంతంలోని ఓ కళాశాలలో చదువుతోంది. నవంబరు 30న కళాశాలకని బయలుదేరిన తమ అమ్మాయి తిరిగిరాలేదని సదరు బాలిక తలిదండ్రులు అదే రోజు రాత్రి సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 4న చాదర్‌ఘాట్‌ వద్ద బాలిక ఆచూకీ లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు తనను కోఠిలోని బస్టాప్‌ నుంచి నగర శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, మరికొంత మంది కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. పోక్సో కేసు నమోదు చేసి సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం మంగళవారం ప్రసారమాధ్యమాల్లో వైరల్‌ కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని