ఉడకని అన్నం.. నీళ్లపప్పు
వసతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా....
వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు
అటకెక్కిన మెనూ
అద్దె భవనాల్లో చలికి వణుకుతున్న చిన్నారులు
- ఈనాడు, హైదరాబాద్ - శేరిలింగంపల్లి, సరూర్నగర్, హయత్నగర్, చేవెళ్ల, న్యూస్టుడే,
శేరిలింగంపల్లిలో కనీస సామగ్రి లేని వంటశాల
వసతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి నగరం, శివారు ప్రాంతాల్లో పలు వసతిగృహాలను సందర్శించగా.. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. మెనూ పాటించడం లేదు. ఉదయం రాగిజావ, పాలు మొదలుకుని రాత్రి భోజనం వరకు ప్రభుత్వ నిర్దేశిత మెనూను అటకెక్కించేశారు. గుడ్లు పెట్టడం లేదు. ఉదయం అల్పహారం బదులు అన్నం వండి పెడుతున్నారు. కూరలు లేకుండా నీళ్ల చారు పోసుకుని అన్నం తినాల్సి వస్తోందని వాపోతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు పెద్దగా హాస్టళ్లలో ఉండటం లేదు. కొన్నిచోట్ల 10శాతం లోపే హాజరు ఉంటోంది. అయినప్పటికీ ఉన్న విద్యార్థుల తగ్గట్టుగా కూడా మెనూ పాటించకుండా గాలికొదిలేశారు. పెరిగిన కూరగాయల ధరలతో అన్ని కూరలు వండటం లేదంటూ అరకొరగానే కూరలు వండి వదిలేస్తున్నారు.
పాడైపోయిన ఫ్యాన్ రెక్కలు
ఇరుకుగదులే దిక్కు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వసతిగృహాల్లో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో.. వెలుతురు సరిగా లేక అవస్థలు పడుతున్నారు. కిటికీలు, తలుపులు విరిగిపోయి ఉండటంతో చలికి వణికిపోతున్నారు. ప్రభుత్వం నుంచి రగ్గులు, బట్టలు, కార్పెట్లు పంపిణీ చేయలేదు.
సరూర్నగర్లో నీటి సదుపాయం లేని సింక్లు
మరుగుదొడ్ల నిర్వహణేదీ..?
మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. శుభ్రత పాటించకపోవడంతో రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 15-20 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి అన్నట్లుగా ఉంది. కరోనా మహమ్మారితో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం పెరిగింది. అయినప్పటికీ.. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వారానికోసారి శుభ్రం చేస్తుండటంతో అపరిశుభ్రత తాండవిస్తోంది.
ప్రమాదకరంగా ఫ్యూజ్బాక్సు
* సరూర్నగర్లోని బీసీ బాలుర వసతిగృహం.. చార్మినార్, ముషీరాబాద్కు సంబంధించిన హాస్టల్ కొనసాగుతోంది. దాదాపు పది రోజుల కిందట ఆహారం సరిగా లేక 15 మంది విద్యార్థులు అస్వస్థతకుగురయ్యారు. 820 విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. కల్తీ ఆహార ఘటన తర్వాత నుంచి 15 మందే ఉంటున్నారు. అద్దె భవనం కావడంతో వెలుతురు సరిగారాక దారుణంగా ఉంది. పెద్దసంఖ్యలో వస్తే ఇరుకుగదుల్లోనే సర్దుకోవాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు సరిపడా లేక అధ్వానంగా మారాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయి చలికి గజగజ వణుతున్నారు. స్విచ్బోర్డులు పాడయ్యాయి.
* శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతి గృహం. 120 మంది పిల్లలకుగాను 23 మందే ఉంటున్నారు. పిల్లలకు మెనూ పాటించడం లేదు. అన్నంసరిగా ఉడకకుండా రుచి లేకుండా కూరలు వండి పెడుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి హాస్టల్ ప్రతినిధిని సందర్శించినప్పుడు కిలో ఆలుగడ్డలు, నాలుగు టమాటాలు మినహా కూరగాయలే లేవు. కూరల్లో కూరగాయ ముక్కలు ఏరుకోవాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. దుప్పట్లు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.
మెస్ ఛార్జీలు పెంచాలి
పెరిగిన ధరలకు తగ్గట్టుగా ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాలి. హాస్టళ్లలో ఎక్కడా మెనూ పాటించడం లేదు. ఉదయం అల్పాహారం పెట్టడం లేదు. సొంత భవనాలు లేక వేరొక ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో వసతులు లేక విద్యార్థులు నానాఅగచాట్లు పడతున్నారు. వెంటనే ప్రభుత్వం ఏ ప్రాంతానికి చెందిన హాస్టల్కు అక్కడే సొంత భవనం నిర్మించాలి.
- గడ్డం శ్యామ్, పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..