logo

విద్యుదాఘాతంతో కాపలాదారు...

ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా నీళ్లు పడుతున్న కాపలాదారుకు విద్యుదాఘాతమై మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్‌లో జరిగింది. సీఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు..

Published : 09 Dec 2021 02:26 IST

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా నీళ్లు పడుతున్న కాపలాదారుకు విద్యుదాఘాతమై మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్‌లో జరిగింది. సీఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ గ్రామానికి చెందిన క్యాసారం మల్లయ్య (70) పట్టణం ఆదర్శనగర్‌ కాలనీలో ఓ వ్యాపారి వద్ద కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నాడు. నిర్మాణం జరుగుతున్న వ్యాపారి కొత్త ఇంటి వద్ద గోడలకు బుధవారం మల్లయ్య నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని