logo

చెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని కుస్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు.. మండలంలోని కుస్నూర్‌ గ్రామానికి చెందిన గొల్ల మహిపాల్‌(30) రోజు మాదిరిగానే ఈ నెల 7న గొర్రెలు కాసేందుకు వెళ్లారు.

Published : 09 Dec 2021 02:26 IST

రాయికోడ్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని కుస్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు.. మండలంలోని కుస్నూర్‌ గ్రామానికి చెందిన గొల్ల మహిపాల్‌(30) రోజు మాదిరిగానే ఈ నెల 7న గొర్రెలు కాసేందుకు వెళ్లారు. కుస్నూర్‌ గ్రామ శివారులోని గుర్మిళ్ల వాగు చెరువులోకి దిగి గొర్రెలను కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయారు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన కాపు బస్వరాజ్‌ గ్రామస్థులకు, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా పూర్తిగా మునిగిపోయి ఉన్నట్లు గమనించారు. పలువురు గ్రామస్థులు చెరువులో వెతికి మహిపాల్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మహిపాల్‌ భార్య నిరోష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని