నింగికేగిన సైనిక శిఖరం..భాగ్యనగరిలో పదిలం
‘‘మీరు ఇక్కడికి దేశం కోసం వచ్చారు.. 140కోట్ల మందిలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం, అదృష్టం దక్కుతుంది. ఇల్లు, కుటుంబం తర్వాత.. దేశమే ముందు కావాలి.. ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి’’ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో మూడేళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు ఈ గడ్డ ఇంకా మర్చిపోలేదు.
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కు నగరంతో ప్రత్యేక అనుబంధం
వివిధ హోదాల్లో పలు మార్లు సైనిక శిక్షణ కేంద్రాల సందర్శన
ఈనాడు, హైదరాబాద్, కంటోన్మెంట్, న్యూస్టుడే
2017: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్
‘‘మీరు ఇక్కడికి దేశం కోసం వచ్చారు.. 140కోట్ల మందిలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం, అదృష్టం దక్కుతుంది. ఇల్లు, కుటుంబం తర్వాత.. దేశమే ముందు కావాలి.. ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి’’ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో మూడేళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు ఈ గడ్డ ఇంకా మర్చిపోలేదు. ఇక్కడి సైనికులు ఆ మాటల్ని గుర్తుచేసుకుంటూ స్ఫూర్తి పొందుతుంటారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. ఆయన లేరనే విషయం తెలిసి విషాదంలో మునిగిపోయారు.
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం నగరవాసుల్ని తీవ్రంగా కలిచివేసింది. వీరితో పాటు మరో 12 మంది సైనిక అధికారులు మృత్యువాత పడిన ఘటన అందర్ని ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆర్మీ చీఫ్గా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాల్లో ఆయన పలుమార్లు హైదరాబాద్లోని వైమానిక, సైనిక శిక్షణ కేంద్రాలను సందర్శించారు. పాసింగ్ అవుట్ పరేడ్లలో పాల్గొన్నారు. వ్యక్తిగతం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని చెప్పేవారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశమే మొదటిది కావాలని చెప్పేవారు.. నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. రాజకీయ నాయకులు, సినిమా తారలకు మాదిరి.. రావత్ సైతం తన ధైర్య సాహసాలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
*చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్తో పాటు ఆయన సతీమణి, సైన్యాధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్సింగ్ వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఒవైసీ పేర్కొన్నారు.
టాసా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఎన్ఎస్.రావుతో రావత్
నగరానికి ఎప్పుడెప్పుడు వచ్చారు?
* 2018 డిసెంబరు 14: చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో జనరల్ బిపిన్ రావత్ సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 27 మంది అధికారులకు ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశారు. తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా(టాసా) ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎంఈ గ్రంథాలయాన్ని సందర్శించారు.
* 2017 సెప్టెంబరు 17: దుండిగల్లోని భారత వాయుసేన అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* 2016 జనవరి 15: సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో సికింద్రాబాద్లో జరిగిన ఆర్మీ డే వేడుకలో పాల్గొన్నారు.
* బేగంపేట, బంజారాహిల్స్లో జరిగిన వివిధ సదస్సులకు ఆయన హాజరయ్యారు.
ఆర్మీ స్టాఫ్ కాలేజ్ వేడుకలో..
సికింద్రాబాద్ టాసా కార్యాలయంలో సైనికాధికారుల సమీక్షలో..
చిరునవ్వే ఆయన చిరునామా
-రిటైర్డ్ బ్రిగేడియర్ శ్రీరాములు
త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్లు హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఎంతగానో కలిచివేసింది. 1986లో నేను, దల్బీర్సింగ్ మేజర్లుగా ఉన్న సమయంలో బిపిన్ రావత్ కెప్టెన్గా ఉన్నారు. ముగ్గురం కలిసి డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇన్స్ట్రక్టర్లుగా పనిచేశాం. అప్పట్లో నేను, దల్బీర్సింగ్, బిపిన్ రావత్లు ఒకే కాలనీలో నివాసముండేవారం. ఎంతో స్నేహపూరితంగా మెలిగే బిపిన్ రావత్ చిరునవ్వే ఆయన చిరునామాగా ఉండేది. అప్పగించే పనులను సమర్థంగా పూర్తి చేసి అద్భుత ఫలితాలు వచ్చేలా చేసేవారు. ప్రపంచస్థాయిలో ఆలోచన చేసే ఆయన.. ముందున్న ముప్పును ముందుగానే పసిగట్టి అందుకు ఎలా సన్నద్దం కావాలో కేంద్ర క్యాబినెట్కు సవివరంగా వివరించి, ఒప్పించే దక్షత కలిగినవారు. ఉన్నత స్థానాలను అధిరోహించినా ఓ సాధారణ వ్యక్తిగానే ఉండే గొప్ప మానవతావాది.
నమ్మశక్యంగా లేదు..
-శ్రీనేష్ కుమార్ నోరి, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి
అత్యంత భద్రత కలిగిన రష్యా హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం నమ్మశక్యంగా లేదు. అందులో బయలుదేరడానికి ముందు మూడంచెల్లో తనిఖీలు ఉంటాయి. పక్కాగా తనిఖీల తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు కాబట్టి మానవ తప్పిదం జరిగే అవకాశం లేదు. కుట్ర కోణం ఉందేమోననే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పొంచి ఉన్న దాడుల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. మనవద్ద అత్యంత పటిష్ఠమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇలాంటిదేమైనా ఉంటే నిఘా సంస్థలు హెచ్చరించేవి. వాతావరణం బాగా లేకపోవడమే కారణమై ఉండొచ్చు. కొండ ప్రాంతాల్లో హఠాత్తుగా వెలుతురు తగ్గిపోతుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సుశిక్షితులైన పైలెట్లు కాబట్టి దీన్ని సైతం ఎదుర్కొనగలరు. విచారణలోనే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్