logo

విలువలతో కూడిన నేత రోశయ్య

మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల కన్నుమూసిన రోశయ్య కుటుంబ సభ్యులను అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని ఆయన నివాసంలో బుధవారం కలిసి సానుభూతి తెలిపారు.

Published : 09 Dec 2021 02:29 IST

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న వెంకయ్యనాయుడు

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల కన్నుమూసిన రోశయ్య కుటుంబ సభ్యులను అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని ఆయన నివాసంలో బుధవారం కలిసి సానుభూతి తెలిపారు. రోశయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రోశయ్యకు, తనకు చిరకాల స్నేహాముందని చెప్పారు. ఎప్పుడూ ఇద్దరం ఫోన్లు చేసుకుంటూ పలకరించుకునేవారమని గుర్తు చేసుకున్నారు. రోశయ్య కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. రోశయ్య ఏ హోదాలో ఉన్నా ఏ విషయాన్నైనా ప్రజలకు చక్కగా అర్ధమయ్యేలా చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని సంప్రదాయాలు పాటించాలని, వాటిని తామిద్దరం కచ్చితంగా అమలుచేసేవారమని తెలిపారు.మంచి రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని