బాలికపై అత్యాచార ఘటనలో ఐదుగురి అరెస్టు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సుల్తాన్బజార్ పోలీసులు బుధవారం కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలిక కోఠి ప్రాంతంలోని ఓ పాఠశాలలో చదువుతోంది. నవంబరు 30న పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు
సుల్తాన్బజార్, న్యూస్టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సుల్తాన్బజార్ పోలీసులు బుధవారం కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలిక కోఠి ప్రాంతంలోని ఓ పాఠశాలలో చదువుతోంది. నవంబరు 30న పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. వెదికినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి తలిదండ్రులు సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిసెంబరు 4న చాదర్ఘాట్ ప్రాంతంలో బాలిక ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు వెళ్లి స్టేషన్కు తీసుకువచ్చారు. విచారించగా.. తనకు తెలిసిన ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి, నగర శివారులో మరో నలుగురితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. అంబర్పేటకు చెందిన ఆటోడ్రైవర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం