Crime News: నీకు మేమక్కర్లేదు.. ఈ జీవితం మాకక్కర్లేదు
‘‘నా హజ్బెండ్ సైకో, శాడిస్ట్. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడు. అతడి అనుమానాలను భరించలేను. మా అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది.. చేస్తోంది ఆలోచించుకో. పిల్లలకి, నాకు ఏం చేశావ్. జత వస్త్రాలు కొన్నావా!
భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలు సహా గృహిణి ఆత్మహత్య
దంపతులు కుసుమ, సాయికుమార్
‘‘నా హజ్బెండ్ సైకో, శాడిస్ట్. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడు. అతడి అనుమానాలను భరించలేను. మా అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది.. చేస్తోంది ఆలోచించుకో. పిల్లలకి, నాకు ఏం చేశావ్. జత వస్త్రాలు కొన్నావా! చదివిస్తున్నావా! నా పిల్లలకి నేనంటే పిచ్చి. నేను లేందే వాళ్లను ఎవరూ చూస్కోరు. అందుకే తీస్కొని పోతున్నా’’
- ఇంట్లోని గోడపై స్వాతి రాసిన ఆత్మహత్య లేఖ
ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన జగన్నాథం, శారద దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. రాజేంద్రనగర్ ఫోర్టువ్యూ కాలనీకు వచ్చి స్థిరపడ్డారు. రెండో కుమార్తె స్వాతికుసుమ(32) ఇంజినీరింగ్ చదివేటప్పుడు వెస్ట్మారేడ్పల్లికి చెందిన సాయికుమార్(32)ను ప్రేమించింది. ఆరేళ్ల క్రితం స్వాతి సోదరి దగ్గరుండి కులాంతర వివాహం జరిపించింది. తొలుత యూసుఫ్గూడలో ఉండేవారు. భార్యభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. భార్య గర్భం దాల్చటంతో ఉద్యోగం మాన్పించాడు. అత్తవారింట గొడవల వల్ల ఫోర్టు వ్యూకాలనీకు మకాం మార్చారు. వారికి తన్విక్(4), శ్రేయ(3) ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. అప్పులు తీర్చాలంటూ భార్యను వేధించసాగాడు. నెల క్రితం అత్త అతనికి రూ.2.50 లక్షల రుణం ఇప్పించింది. శుక్రవారం రాత్రి విధులకు వెళ్లిన సాయికుమార్ శనివారం ఉ. 5 గంటలకు వచ్చి హాలులో నిద్రపోయాడు. సాయంత్రం నిద్రలేచి, పడకగదిలో ఉన్న భార్య, పిల్లల్ని పిలిచాడు. స్పందన లేకపోవడంతో తలుపులు పగులకొట్టినట్టు పోలీసులకు తెలిపాడు. అప్పటికే భార్య, పిల్లలు మరణించారని వివరించాడు. స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతడు ఇంట్లోనే ఉన్నాడని ఆరోపిస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా సాయి పట్టించుకోలేదని మృతురాలి సోదరి ఆరోపించారు. పిల్లలను అల్లుడే హత్యచేశాడని స్వాతి తల్లి శారద ఆరోపించారు. సాయికుమార్ ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై భార్య నిలదీయటంతోనే గొడవలు ఎక్కువయ్యాయన్నారు.
- ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, రాజేంద్రనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!