logo

TSRTC: రూ.100 టిక్కెట్‌పై 20 శాతం తగ్గింపు

పుస్తక ప్రియులకు టీఎస్‌ఆర్టీసీ చిన్న శుభవార్త చెప్పింది. నగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే

Updated : 20 Dec 2021 10:09 IST

పుస్తక ప్రదర్శన సందర్భంగా ఆర్టీసీ కానుక

ఈనాడు, హైదరాబాద్‌: పుస్తక ప్రియులకు టీఎస్‌ఆర్టీసీ చిన్న శుభవార్త చెప్పింది. నగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో రూ.వంద టిక్కెట్‌పై 20 శాతం రాయితీ ప్రకటించింది. ఈనెల 27 వరకు తగ్గింపు పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. నగరంలో 24 గంటలపాటు చెల్లుబాటయ్యే రూ.100 ‘టీ24’ టిక్కెట్‌ కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుందని తెలిపింది. గతంలో మాదిరి కాకుండా, ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్‌ కొనుగోలు చేస్తే మరుసటి రోజు అదే సమయం వరకు వినియోగించుకోవచ్చని సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని