logo

TS News:పాటలు వింటూ పట్టాలపైకి.. రైలు ఢీకొని ఒకరి మృతి

చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతున్న యువకుడిని రైలు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స

Updated : 20 Dec 2021 07:24 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతున్న యువకుడిని రైలు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభు కుమారుడు బోగం నరేష్‌(19) నగరంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ బొల్లారం బజార్‌- బొల్లారం రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు 108 అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని