logo

మలద్వారంలో ఉంచుకొని 1,190 గ్రాముల బంగారం తరలింపు

విదేశాల నుంచి అడ్డదారిలో అక్రమ బంగారాన్ని తరలించడానికి స్మగ్లర్లు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నెల 11న నలుగురు విదేశీ ప్రయాణికులు మలద్వారంలో 7.3 కిలోల బంగారం తీసుకొచ్చి

Updated : 28 Dec 2021 08:50 IST

స్వాధీనం చేసుకున్న పసిడి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: విదేశాల నుంచి అడ్డదారిలో అక్రమ బంగారాన్ని తరలించడానికి స్మగ్లర్లు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నెల 11న నలుగురు విదేశీ ప్రయాణికులు మలద్వారంలో 7.3 కిలోల బంగారం తీసుకొచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కారు. తాజాగా సోమవారం హైదరాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడు మలద్వారంలో 1190 గ్రాముల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి వస్తున్న క్రమంలో 1,190 గ్రాముల బంగారాన్ని కరిగించి ముద్ద చేసి మలద్వారంలో పెట్టుకొని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు. ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో విచారించగా.. రూ.59.23 లక్షల విలువైన బంగారం తరలింపు గుట్టురట్టయింది. ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని