logo

TS News: బిస్కెట్లివ్వండి.. వివరం చెబుతా!

ఇంటి నుంచి తప్పిపోయిన బుడతడిని గంటలోనే ఇంటికి చేర్చారు పోలీసులు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌నగర్‌కు చెందిన మిథున్‌(4) గాజులరామారం రోడ్డులో సోమవారం ఏడుస్తూ కనిపించడంతో

Updated : 28 Dec 2021 07:44 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఇంటి నుంచి తప్పిపోయిన బుడతడిని గంటలోనే ఇంటికి చేర్చారు పోలీసులు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్‌నగర్‌కు చెందిన మిథున్‌(4) గాజులరామారం రోడ్డులో సోమవారం ఏడుస్తూ కనిపించడంతో పెట్రోకార్‌ సిబ్బంది ఠాణాకు తీసుకొచ్చారు. ఎస్సై మన్మధరావు బాలుడి వివరాల్ని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా నోరు విప్పలేదు. బిస్కెట్లు ఇస్తేనే చెబుతాననడంతో తెప్పించారు. తింటూ వచ్చి రాని మాటలతో తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. బాలుడి వివరాల మేరకు.. సంజయ్‌గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. ఓ కిరాణ దుకాణం నిర్వాహకుడు గుర్తుపట్టి ఇంటిని చూపించాడు. పోలీసులు వెంటనే తండ్రి టింకుకు బాలుడు మిథున్‌ను అప్పగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని