logo

Suicide: అమ్మ పిలిచిందంటూ లేఖ రాసి.. అనంతలోకాలకు

‘అమ్మ పిలిచింది’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కథనం ప్రకారం

Updated : 28 Dec 2021 06:45 IST

సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: ‘అమ్మ పిలిచింది’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కథనం ప్రకారం.. కొత్తపేట పరిధి హుడా కాలనీలో నివాసముంటున్న విశ్వనాథ్‌రాజు, వైశాలీ(39)లకు 2005లో వివాహమైంది. విశ్వనాథ్‌ బ్యాంకు ఉద్యోగి కాగా.. వైశాలి ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం సాయంత్రం వైశాలి ఇంట్లోని గదిలో ప్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే లభించిన సూసైడ్‌ నోట్‌లో ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారని, అమ్మ పిలిచింది పోతున్నా..’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. వైశాలి తల్లి కొన్నిరోజుల క్రితం మృతి చెందిందని మనోవేదన చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని