Thagulla Gopal: పశువులు కాసి చదువుకొని..పేదరికాన్ని అక్షరబద్ధం చేసి
అది 2007 సంవత్సరం. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు.. నాగార్జునసాగర్ వద్ద బీసీ హాస్టల్లో ఉన్నా. వాన పడుతోంది. ఆ సమయంలోనూ నా తల్లి ఒక పచ్చడి డబ్బా పట్టుకుని నాకోసం
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్
తల్లి ఎల్లమ్మతో గోపాల్
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, మాడ్గుల: అది 2007 సంవత్సరం. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు.. నాగార్జునసాగర్ వద్ద బీసీ హాస్టల్లో ఉన్నా. వాన పడుతోంది. ఆ సమయంలోనూ నా తల్లి ఒక పచ్చడి డబ్బా పట్టుకుని నాకోసం వచ్చి హాస్టల్ ముందు నిల్చుని ఉంది. ఆ డబ్బాలోని పచ్చడి నుంచి నూనె కారుతుండటం నాకు ఇప్పటికీ గుర్తే..!
‘‘దారి తెల్వకున్నా..
ఎన్నో దూరాలు దాటి..
నూనె కారిపోతున్న చట్నీ డబ్బాతో..
మా హాస్టల్ ముందు నిలబడ్డ
దేవగన్నేరు పువ్వు.. అమ్మ!
- అమ్మ కష్టాన్ని, పరిస్థితిని అక్షరబద్ధం చేసిన క్రమం అద్భుతం.!
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్.. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజీలాపూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి చదువు కొనసాగించారు. ఐదో తరగతి పూర్తయ్యాక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి పశువులు కాయాల్సి వచ్చింది. గోపాల్ ప్రతిభను గమనించిన అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజవర్ధన్రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించారు. చదువు కొనసాగించాలని తల్లిదండ్రులను ఒప్పించారు. అలా ఉదయం, సాయంత్రం గొర్రెలు, ఆవులు కాస్తూ మధ్యలో పాఠశాలకు వెళ్లారు. కల్వకుర్తిలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ సమయంలోనూ రాజవర్ధన్రెడ్డి చేయూత అందించారు. తర్వాత నేరెడ్మెట్లో డీఎడ్ పూర్తి చేశారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.
కవితా ప్రయాణం.. అలా మొదలు..
టీటీసీ చేస్తున్నప్పుడు నగరంలోని త్యాగరాయగాన సభలో ఓ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ నారాయణ శర్మ రాసిన అస్తిత్వ పుష్పాలు అనే పుస్తకం చదివారు. అప్పుడే నానీలు రాయడం ప్రారంభించారు. తర్వాత వచన కవిత్వం వైపు మళ్లారు. సమాజంలో అసమానతలు.. పేదరికం.. ఈ రెండూ ప్రాతిపదికగా పాఠకుడికి అర్థమయ్యే భాషలో కవిత్వం రాయడం ప్రారంభించారు. పేదరికాన్ని ఎత్తిచూపుతూ మానవ సంబంధాలు, విలువలను అక్షరబద్ధం చేసి సాధారణ పాఠకుడిలోనూ ఆలోచన రేకెత్తించడం గోపాల్ కవిత్వానికే సాధ్యం.
అక్క చనిపోవడం విషాదకర ఘటన
గోపాల్కు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అక్క హంసమ్మ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన అతని జీవితంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. అందుకే ఆయన కవిత్వంలో అక్కపై ప్రత్యేకంగా వాక్యాలు రాశారు.
పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు
చిన్నప్పుడు తాను పడిన కష్టాలు మరెవరూ అనుభవించ కూడదని గోపాల్ భావిస్తుంటారు. అందుకే ఎనిమిదేళ్లుగా ఊళ్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నారు.
కవితలు.. పురస్కారాలు
అమ్మపోసిన గంజినీరుపై రాసిన ‘గంజి’, పశువులను కాసిన బాల్యపు స్మృతుల ‘ముల్లుపాఠం’, మహిళలపై అకృత్యాలపై ‘నా బంగారం కదూ’, కుల పట్టింపులపై ‘నొసటిపై గాయం’ కవితలు ఎంతో పేరు తెచ్చాయి. దండకడియం కవితా సంపుటికి 2019లో పాలమూరు సాహితీ పురస్కారం లభించింది. ఈ ఏడాది తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.
దండకడియం వెనుక స్ఫూర్తి అదే
దండకడియం కవితా సంపుటిని తన తాత, ఆయనలాంటి ఎంతోమంది కష్టాలను గమనించి రాసినట్లు చెబుతున్నారు గోపాల్. గొర్రెల కాపర్ల వేదన, పేదల జీవితంలో ఎదుర్కొనే ఒడుదొడుకులను పొందుపరిచినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!