Hyderabad News: ఆ ఐదుగురు ఎవరు? మారుపేర్లతో రూ.కోట్ల మత్తు వ్యాపారం
యువతను మత్తుకు బానిసలు చేస్తూ మాఫియా కోట్లు కూడబెడుతోంది. గోవా, ముంబయిల్లో ఉంటూ నగరంలో చక్రం తిప్పుతోంది. మాదకద్రవ్యాల రవాణా మూలాలను నాశనం....
సరకు నగరం చేరే వరకు వారి కనుసన్నల్లోనే
ఈనాడు, హైదరాబాద్ రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: యువతను మత్తుకు బానిసలు చేస్తూ మాఫియా కోట్లు కూడబెడుతోంది. గోవా, ముంబయిల్లో ఉంటూ నగరంలో చక్రం తిప్పుతోంది. మాదకద్రవ్యాల రవాణా మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ముమ్మరంగా చేపట్టిన తనిఖీల్లో చాలామంది దొరుకుతున్నారు. తాజాగా పోలీసువర్గాలు సేకరించిన సమాచారంలో కీలక వివరాలు వెలుగు చూసినట్లు తెలిసింది. సికింద్రాబాద్, పాతబస్తీ, జీడిమెట్ల, కూకట్పల్లి, గోల్కొండల్లో మకాం వేసిన సూత్రధారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఐదుగురు దేశ, విదేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే దళారులు, సరఫరాదారులు, కొనుగోలుదారులతో లావాదేవీలు జరుపుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సముద్రమార్గంలో గోవా, ముంబయిలకు చేరిన మాదకద్రవ్యాలను అక్కడి వ్యాపారుల ద్వారా ప్రధాన సరఫరాదారులకు చేరిన సరకును హైదరాబాద్ తీసుకొచ్చేంత వరకూ ఈ ఐదుగురు సమన్వయం చేసుకుంటారని తెలుస్తోంది. మారుపేర్లతో లావాదేవీలు నిర్వహించే వీరిలో ఇద్దరు నైజీరియన్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముంబయి, దిల్లీ, గోవా వంటి ప్రధాన నగరాలకు పర్యాటక వీసాపై వచ్చిన నైజీరియన్లు అక్కడి స్మగ్లర్ల ద్వారా సరుకు సేకరించి.. హైదరాబాద్లో చదువుకుంటున్న తమ దేశస్థులకు చేరవేస్తున్నారు. నైజీరియన్లపై సరైన నిఘా లేకపోవటం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్పై అవగాహన లోపం మాఫియాకు అనుకూలంగా మారాయనే విమర్శలున్నాయి.
మైనర్లతో సరఫరా..
ముంబయి, గోవాల నుంచి బస్సు, ప్రయివేటు వాహనాల ద్వారా మత్తుపదార్థాలు నగరానికి చేరుతున్నాయి. బ్యాగుల్లో కొద్దిమొత్తంలో సరకు తీసుకొస్తుంటారు. ఇటీవల చిక్కిన విక్రేతలు, కొనుగోలు దారుల సెల్ఫోన్లలో నెంబర్ల ఆధారంగా పోలీసులు నిఘా పెంచారు. అప్రమత్తమైన స్మగ్లర్లు వాటి రవాణాకు మైనర్లను రంగంలోకి దింపారు. మైనర్ల చేతికి కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ వంటి మత్తుపదార్థాలను ఇచ్చి కొనుగోలుదారుల వద్దకు చేరవేస్తున్నారు. పిల్లల కదలికలను గమనించేందుకు కొందరు ద్విచక్రవాహనాల్లో అనుసరిస్తున్నారు. పుస్తకాల బ్యాగుల్లో ప్యాకెట్లను ఉంచుతున్నారు. 12-15 సంవత్సరాల లోపు బాలురు కావడంతో పోలీసులు అనుమానించరనే ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ముంబయిలో కత్రినా, కరీనా, సల్మాన్ తదితర సినీతారల పేర్లను మత్తుపదార్థాల కోడ్ భాషగా ఉపయోగిస్తున్నారు. నగరంలో ఆర్డీఎక్స్, ఎండీ, స్టఫ్, మాల్, సినిమా పేర్లను కోడ్ పదాలుగా వాడుతున్నారు.
రూ.వెయ్యి కోట్ల పైమాటే..
కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ ఖరీదైన మత్తుపదార్థాలు. గోవా, ముంబయి నగరాల నుంచి హైదరాబాద్ చేర్చితే నాలుగైదు రెట్లు లాభం. ఇక్కడ దాన్ని గ్రాములుగా మార్చి గమ్యానికి చేర్చితే పదిరెట్లు డబ్బు జేబులో పడినట్టే. తేలికమార్గంలో డబ్బు సంపాదనకు యువత స్మగ్లర్లుగా మారుతున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 2021లో పట్టుబడిన మత్తుపదార్థాల విలువ సుమారు రూ.200-250 కోట్ల పైమాటే అని అంచనా. ఖాకీల కన్నుగప్పి, అబ్కారీ దాడులకు దొరక్కుండా నగరంలోకి చేరే వాటి విలువ రూ.1000 కోట్ల వరకూ ఉంటుందంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించారు. అసలు సూత్రదారులు ఎవరు? తెర వెనుక నుంచి ఇంత పెద్ద మాఫియాను నడిపిస్తున్నదెవరనే వివరాలు పోలీసులకు సవాల్గా మారాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై కఠిన వైఖరి అవలంబించటంతో మూడు కమిషనరేట్ల పరిధిలో యాంటీ నార్కొటిక్ సెల్లను ప్రారంభించి ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా నగర పోలీసులు మాఫియా రాకెట్ను ఛేదించారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కూపీ లాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?