TS News:అడ్డదారిలో సంపాదిద్దామని అడ్డంగా బుక్కయ్యారు!
ఏపీ నుంచి తెలంగాణలోకి గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా రాచకొండ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడింది. ముఠాలోని వి.తిరుపతి(27), అతడి తమ్ముడు మక్తా(25),
గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న సీపీ మహేశ్భగవత్
ఈనాడు, హైదరాబాద్ నాగోలు, న్యూస్టుడే : ఏపీ నుంచి తెలంగాణలోకి గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా రాచకొండ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడింది. ముఠాలోని వి.తిరుపతి(27), అతడి తమ్ముడు మక్తా(25), పి.రవీందర్(24), వి.కళ్యాణ్(19)లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2 కార్లు, 294 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బుచ్చిబాబు, కారం సురేంద్ర దొర కోసం గాలిస్తున్నారు. సోమవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేసులో ప్రధాన సూత్రదారి వి.తిరుపతి సొంతూరు నాగర్కర్నూలు జిల్లా కిస్టంపల్లి తండా. క్యాబ్ డ్రైవరైన ఇతను.. ఏడాది క్రితం కారు కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. గతంలో గంజాయి సరఫరా చేస్తూ జైలు కెళ్లొచ్చాడు. ఈ నేపథ్యంలోనే 25 రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కారు కిరాయికి కుదుర్చుకుని రంపచోడవరం తీసుకెళ్లాడు. అక్కడ నుంచి నగరానికి గంజాయి చేర్చినందుకు రూ.20,000 కిరాయి గిట్టుబాటైంది. ఆ సమయంలో దళారి బుచ్చిబాబు అలియాస్ బాపూజీతో పరిచయం ఏర్పడింది. అతడి సహాయంతో గంజాయి రవాణా చేసి ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నాడు. వి.తిరుపతి, అతడి తమ్ముడు మక్తా, పి.రవీందర్, వి.కళ్యాణ్లు ఈ నెల 7న రెండు కార్లలో రంపచోడవరం చేరారు. బుచ్చిబాబు సహకారంతో అక్కడ 294 కిలోల సరకు కొనుగోలు చేశారు. 8వ తేదీ అర్ధరాత్రి దాటాక బుచ్చిబాబు రెండు కార్లను అటవీ ప్రాంతం దాటించాడు.
ఎస్కార్ట్తో పక్కా ప్రణాళిక
ముందు ఎస్కార్ట్ వాహనం. వెనుక గంజాయి ఉన్న కారు. వాటి మధ్య కనీసం 2 కి.మీ దూరం. పోలీసుల తనిఖీలను ఎప్పటికప్పుడు చేరేలా ఏర్పాట్లు. చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద పోలీసు తనిఖీలను గమనించి.. గంజాయి ఉన్న కారును రామన్నపేట వైపు వెళ్లేందుకు మలుపు తిప్పారు. అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారు. రామన్నపేట పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకున్నారు. వి.తిరుపతి, మంక్తా, రవీందర్, కళ్యాణ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బుచ్చిబాబు, కారం సురేంద్ర దొర కోసం గాలిస్తున్నారు.
ఎవరీ బుచ్చిబాబు?
బుచ్చిబాబు అలియాస్ బాబూజీ సొంతూరు దారకొండ. రంపచోడవరం - హైదరాబాద్ గంజాయి చేరవేయటంలో కీలకసూత్రదారి. పెద్ద మొత్తంలో సరకు రవాణా చేస్తుంటాడు. ఏజెన్సీ ప్రాంతంలో కొద్దిమేర అడ్వాన్స్ చెల్లించి గంజాయి ఇచ్చేందుకు సహకారం అందిస్తాడు. బుచ్చిబాబు కనుసన్నల్లోనే గంజాయి రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోనూ పలు కేసులున్నట్లు సమాచారం. ఇతడు పట్టుబడితే కీలక సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?