ఊరెళ్తున్నారా..కరోనా తీసుకెళ్లొద్దు!
సంక్రాంతి అంటే చాలు.. భాగ్యనగరం పల్లెకు వరుస కడుతుంది. రెండేళ్లుగా కరోనాతో సంబరాలకు దూరంగా ఉంటున్న చాలామంది.. ఈ ఏడాది ఊరిలో జరుపుకోవాలని పల్లె బాట పడుతున్నారు. 10-15 లక్షల మంది ఈ వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు పయనమవ్వగా.
జాగ్రత్తలు తీసుకుంటే మేలంటున్న వైద్యులు
ఈనాడు, హైదరాబాద్
సంక్రాంతి అంటే చాలు.. భాగ్యనగరం పల్లెకు వరుస కడుతుంది. రెండేళ్లుగా కరోనాతో సంబరాలకు దూరంగా ఉంటున్న చాలామంది.. ఈ ఏడాది ఊరిలో జరుపుకోవాలని పల్లె బాట పడుతున్నారు. 10-15 లక్షల మంది ఈ వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు పయనమవ్వగా.. ఇంకా కొంతమంది వచ్చే రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్నందున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాసరే.. మన నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలతో పోల్చితే భాగ్యనగరంలో రోజుకు వేయికి తక్కువ లేకుండా కరోనా కేసులు బయట పడుతున్నాయి. ఇందులో అధికశాతం ఒమిక్రాన్ వేరియంట్ బాధితులే ఉంటున్నారు. సాధారణ డెల్టాతో పోల్చితే దీని వ్యాప్తి అయిదు రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చాలామందిలో వైరస్ సోకినా సరే... ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇలాంటి వారి ద్వారా ఊళ్లో ఉన్న పెద్ద వారికి సోకితే.. వారి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకొంటే... సరదాగా అందరితో పండుగను జరుపుకొని తిరిగి ఆనందంగా పట్టణానికి చేరుకోవచ్చు.
ప్రగతిభవన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు చేతులకు గ్లౌజులు ధరించారు.
24 గంటల్లో 1682 మందికి నిర్ధారణ
గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రెండు రోజులపాటు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా...తాజాగా బుధవారం 1682 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో జీహెచ్ంఎసీ పరిధిలో 1275, రంగారెడ్డి జిల్లాలో 173, మేడ్చల్-మల్కాజిగిరిలో 234 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, గుంపులకు దూరంగా ఉండటంతోపాటు చేతి శుభ్రత తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిపుణుల సూచనలు ఇవీ..
* ఊరెళ్లే ముందు తప్పనిసరిగా అందరూ టీకా రెండు డోసులు తీసుకోవాలి. కుటుంబంలో 15-18 ఏళ్ల వారుంటే తొలి డోసు అయినా వారికి ఇప్పించాలి.
* జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటివి ఉంటే వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. అందులో నెగెటివ్ వస్తేనే ఊరు వెళ్లాలి.
* బస్సులు, రైళ్లలో వెళ్లేటప్పుడు ఎన్-95 మాస్క్ ధరించాలి. లేదంటే క్లాత్మాస్క్పై.. సర్జికల్ మాస్క్ పెట్టుకోవాలి.
* కోడి పందేలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద వందల సంఖ్యలో గుంపులుగా ఉంటారు. ఇలాంటి రద్దీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం మేలు.
* చుట్టాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, శుభ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో పాల్గొనటం తగ్గించుకోవాలి. ఒకవేళ వారిళ్లకు వెళ్లినా సామాజిక దూరం పాటించాలి.
ఉద్ధృతి లేకున్నా ఉదాసీనత వద్దు
గాంధీలో 70, టిమ్స్లో 42 మందికి చికిత్స
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో డెల్టా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పది రోజులుగా పెద్దఎత్తున కేసులు వస్తున్నా కూడా గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. గాంధీలో కరోనా రోగుల కోసం 300 పడకలను కేటాయిస్తే బుధవారం వరకు 70 మంది చేరి చికిత్స పొందుతున్నారు. టిమ్స్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ 42 కరోనా కేసులున్నాయి. నమోదవుతున్న కేసుల ప్రకారం చూస్తే ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నా ఉదాసీనంగా ఉండొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ లక్షణాలే ఉంటున్నాయి
రోజూ పది నుంచి పదిహేను మంది వరకు చేరుతున్నారు. సాధారణ వైద్యంతోనే వీరికి నయం అవుతోంది. మధుమేహంతోపాటు ఇతరత్రా వ్యాధులున్న వారు మాత్రం నిర్లక్ష్యం చేయకండా వైద్యులు పర్యవేక్షణలో ఉండటం ఉత్తమం.
- డాక్టర్ రామరాజు, ఆర్ఎంవో, టిమ్స్
భయపడాల్సిన అవసరం లేదు
కరోనా రోగుల కోసం మొన్నటి వరకు 200 పడకలుండేవి. ఇప్పుడే ఈ సంఖ్య 300కు చేశాం. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 1100 పడకల్లో ఉన్న సాధారణ రోగుల్లో అవసరమైన వారికి త్వరితగతిన శస్త్రచికిత్సలు చేసి అవసరమైతే వాటిని కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉంచాలని అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే గాంధీలో చేరే బాధితుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ఎంతమంది వచ్చినా కూడా వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
- డా.ప్రభాకరరెడ్డి, నోడల్ అధికారి గాంధీ ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?